
విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి వెకేషన్కు వెళ్లిన ఆమె, తాము బస చేసిన హోంస్టే గదిలో నిన్న ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.విశాఖపట్నానికి చెందిన పి.
రాధా గాయత్రి (27) ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. పుణేలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న సౌమ్య శ్రీచరణ్తో ఆమెకు 2025 నవంబర్ 8న వివాహమైంది. వీరు విహారయాత్ర కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి, జూన్ 14న రాత్రి మసూరీ-ధనౌల్తి రోడ్డులోని కియానా హోంస్టేలో గది తీసుకున్నారు.ఘటన జరిగిన రోజు రాత్రి తాము మద్యం సేవించామని, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయినట్లు భర్త శ్రీచరణ్ పోలీసులకు తెలిపాడు.
ఉదయం నిద్రలేచి చూసేసరికి, గాయత్రి నేలపై వివస్త్రగా, అపస్మారక స్థితిలో పడి ఉందని, ఆమె ముక్కు నుంచి రక్తం వస్తోందని వివరించాడు. మూత్రం మడుగులో ఆమె పడి ఉందని తెలిపాడు. గదిలో రక్తపు మరకలతో పాటు రెండు ఖాళీ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు.సోమవారం ఉదయం 7:23 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయత్రి అప్పటికే మరణించినట్లు అక్కడి ఫార్మసిస్ట్ ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డెహ్రాడూన్లోని కొరొనేషన్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ మనోజ్ అస్వాల్ మాట్లాడుతూ, "పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల