
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Big twist in Ex hyderabad mayor Gadwal Vijayalakshmi sister missing case: తెలంగాణలో ఇటీవల మహిళలపై దాడులు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ లో ఎక్కువగా పలు ఇళ్లలో చోరీలు, మహిళలపై దాడులు, హత్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
ఈ క్రమంలో సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా అనుకొని ఘటనల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మాజీ మేయర్, తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి తన సోదరి కన్పించడంలేదంటూ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివసించే తన సోదరి కె. నమ్రత(57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా..
సతీష్ (35), సత్యనారాయణ(45), కుమారి(45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో మాజీ మేయర్ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ మేయర్ ఇంటి చుట్టు ఉన్న సీసీ కెమెరాల్ని జల్లెడపట్టడం ప్రారంభించారు.
ఆ ఇంటి సమీపంలో ఉన్నవారిని విచారిస్తున్నారు. ఇంతలో గద్వాల విజయలక్ష్మీ సోదరి నమ్రత తాను ఎక్కడకు వెళ్లలేదని పోలీసులకు చెప్పింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్నిగంటల క్రితమే కిడ్నాప్ అంటూ కేసు పెట్టి..
ఆ తర్వాత యువతి స్వయంగా అదేంలేదని చెప్పడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం గద్వాల
విజయలక్ష్మీ కుటుంబ వ్యవహరం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.