
బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరమైన స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ స్థానంలో భారత సంతతి ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరిని
ఎంపిక చేశారు. ఢిల్లీలో జన్మించిన నిఖిల్, తుది జట్టులో చోటు దక్కించుకుంటే... 1964 తర్వాత భారత్ లో జన్మించి ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి పురుష క్రికెటర్గా 30 ఏళ్ల నిఖిల్ చౌదరి చరిత్ర సృష్టించనున్నాడు. బంగ్లాదేశ్లోని పిచ్లు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో నిఖిల్కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఈ జట్టులో ఆడమ్ జంపా, మాథ్యూ కునెమన్లతో కలిసి నిఖిల్ స్పిన్ విభాగంలో కీలకం పాత్ర పోషించనున్నాడు.లెగ్ స్పిన్తో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న నిఖిల్ చౌదరి, దేశవాళీ మరియు ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణించి జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. బిగ్ బాష్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ తరఫున, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను ఆడాడు. శుక్రవారం అతను జట్టుతో కలుస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. జూన్ 17 నుంచి చట్టోగ్రామ్ వేదికగా ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.1996లో ఢిల్లీలో జన్మించిన నిఖిల్, సుమారు దశాబ్దం క్రితం తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అంతకుముందు భారత్లో దేశవాళీ క్రికెట్ ఆడిన సమయంలో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్