
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిస్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం వివిధ దేశాల ప్రతినిధులు, పోటీల్లో పాల్గొనే అథ్లెట్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పోటీ క్రీడగా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఈ ఛాంపియన్షిప్ యోగాకు ఒక కొత్త దశకు నాంది పలికిందన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్తో సహా అంతర్జాతీయ క్రీడా వేదికల్లో యోగాసనకు చోటు దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ ఈ యోగాసన క్రీడల ప్రపంచ ఛాంపియన్షిప్ అటువంటి నవశకానికి నాంది పలుకుతుంది. ఈ ఛాంపియన్షిప్ ద్వారా యోగాసనం ఒక పోటీ క్రీడగా గుర్తింపు పొందుతుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఇతర బహుళ క్రీడా పోటీల వంటి అంతర్జాతీయ క్రీడా వేదికలలో యోగాసనం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని విశ్వసిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 8 వరకుప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. యూఎస్ఏ, ఘనా, కెన్యా, మలేసియా, శ్రీలంక, ఉజ్బెకిస్థాన్ ..తదితర 60 పైగా దేశాల అథ్లెట్లు పోటీపడుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.