
నంద్యాల, మే31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం తల ధ్వంసం చేసిన వ్యవహారంలో వెలుగులోకి వైసీపీ కుట్రలు వచ్చాయి.
సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వైసీపీ డ్రామా బట్టబయలయ్యాయి. ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్య అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల వార్డు కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్య అనుచరుడిగా నిందితుడు జమలయ్య ఉన్నారు.
వైసీపీ రాజకీయ కార్యకలాపాల్లో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా నిందితుడు జమలయ్య ఉన్నారు. 2022లో అప్పటి పాలకుల సిఫార్సుతో కమ్యూనిటీ రిసోర్సు పర్సన్గా జమలయ్య భార్య పని చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం ఏమి లేదని, ఈ ఘటనలో నేరుగా నిందితుడు జమలయ్య పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.
సీసీ కెమెరాల వీడియోతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఈ కుట్రలో ఇతరుల భాగస్వామ్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ముందుగానే ఈ కుట్రకు పాల్పడ్డారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి... విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..! పోలీసులపై
నంద్యాల, మే31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం తల ధ్వంసం చేసిన వ్యవహారంలో వెలుగులోకి వైసీపీ కుట్రలు వచ్చాయి. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వైసీపీ డ్రామా బట్టబయలయ్యాయి. ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్య అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల వార్డు కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్య అనుచరుడిగా నిందితుడు జమలయ్య ఉన్నారు. వైసీపీ రాజకీయ కార్యకలాపాల్లో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా నిందితుడు జమలయ్య ఉన్నారు. 2022లో అప్పటి పాలకుల సిఫార్సుతో కమ్యూనిటీ రిసోర్సు పర్సన్గా జమలయ్య భార్య పని చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం ఏమి లేదని, ఈ ఘటనలో నేరుగా నిందితుడు జమలయ్య పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల వీడియోతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఈ కుట్రలో ఇతరుల భాగస్వామ్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ముందుగానే ఈ కుట్రకు పాల్పడ్డారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్తలు కూడా చదవండి... విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..! పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత Read Latest AP News And Telangana News And National News And Telugu News