
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
IND Vs ENG 2nd T20I Preview: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఐదు టీ20 మ్యాచ్లను ఆడనుండగా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదే మ్యాచ్లో భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అయితే ఇంతకు ముందు ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే అది కుదరలేదు. కేవలం వైభవ్ బెంచ్ మార్క్కు పరిమితమవ్వగా.. ఆ సిరీస్లో ఐర్లాండ్తో వైట్వాష్కు గురయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్లో వైభవ్కు అవకాశం వస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.
ఈ వారం ప్రారంభంలో డర్హామ్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం తమ సాధారణ ఓపెనింగ్ జోడీతోనే ముందుకు సాగింది. అయితే, సంజు శాంసన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో, త్వరలోనే సూర్యవంశీ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే రెండు అర్ధశతకాలు (మొదటిది ఐర్లాండ్పై, రెండోది జూలై 1న ఇంగ్లాండ్పై) సాధించాడు. కాబట్టి జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. పరుగులు సాధించాల్సిన ఒత్తిడి పూర్తిగా సంజు శాంసన్పైనే ఉంది. వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్లో, శాంసన్ ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
భారత్కు మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా ఎంపికైన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవమైన ఫామ్. అతని స్ట్రైక్ రేట్ ఎంత ఆందోళనకరంగా ఉందో, స్లో బాల్స్ను ఎదుర్కోవడంలో అతని తీరు కూడా అంతే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఏడాది ఆడిన గత 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో తిలక్ వర్మ కేవలం 12 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. అంటే సగటున మ్యాచ్కు ఒకటి చొప్పున అన్నమాట. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో, ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండా బౌలింగ్ విభాగం పటిష్టంగా కొనసాగే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ విషయానికొస్తే, మొదటి T20Iలో పూర్తిస్థాయిలో కనిపించని వారి బ్యాటింగ్ లైనప్ భారత్కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. సిరీస్ ప్రారంభ మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రాగా, జోష్ టంగ్ కూడా జట్టులో చేరారు. టంగ్ ఈ రోజు తన వైట్-బాల్ అరంగేట్రం చేయనున్నారు.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో T20I ఎప్పుడు,ఎక్కడ? భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్ల T20I సిరీస్లో రెండో మ్యాచ్, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో శనివారం, జూలై 4న సాయంత్రం 7:00 గంటల (IST) నుండి జరుగుతుంది. ఈ 5 మ్యాచ్ల సిరీస్ మొత్తాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానెళ్లలోనూ, అలాగే సోనీ లివ్ (Sony LIV) యాప్ లేదా వెబ్సైట్లోనూ ప్రసారం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.