
Jacqueline Fernandez Kiss Controversy: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిన శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2006లో ఆమె మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకొని.. మోడలింగ్ రంగంలో అడుగులు వేసింది. ఆ తర్వాత కొద్దికాలంలో బాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగింది. అయితే ఈ బ్యూటీ ఓ సినిమా షూటింగ్లో కట్ చెప్పినా హీరోని ముద్దులతో ముంచేసిందట. ఇంతకీ ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలకో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకోగా.. ఆ తర్వాత నటిగా సినిమాల్లో చేయడం సహా స్పెషల్ సాంగ్స్ (ఐటెమ్ సాంగ్స్)లో నటిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో కనువిందు చేసింది జాక్వెలిన్.
అయితే ఇటీవలే కాలంలో సినిమాల కంటే అనేక వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మోసాల కేసులో ఈమెకు తన ప్రియుడి సుకేశ్ చంద్రశేఖర్తో ఎంతో సన్నిహిత్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే సుమారు రూ.200 కోట్ల మేర మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుమార్లు ఆమెను విచారించింది.
అప్పట్లో ఆమె ప్రియుడు సుకేశ్ ఇచ్చిన ఖరీదైన బహుమతులు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు వంటివి అప్పట్లో పెద్దఎత్తున వార్తల్లో నిలిచాయి. సుకేశ్ ప్రస్తుతం జైల్లో ఉన్నా తరచూ తన ప్రియురాలు జాక్వెలిన్కు లేఖలు రాస్తున్నాడని సమాచారం.
ఇదిలా ఉండగా ఇటీవలే ఓ టాక్షోలో ప్రముఖ మీడియా సంస్థ ఛైర్మన్ సిమి చందోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ను ఊపేస్తున్నాయి. షూటింగ్ సమయంలో కిస్సింగ్స్ సీన్స్లో ఎవరైనా నటీనటులు కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా జాక్వెలిన్కు సంబంధించిన రెండు సంఘటలను ప్రస్తావించారు.
'జెంటిల్మాన్' షూటింగ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కిస్సింగ్ సీన్ చేస్తున్న నేపథ్యంలో కట్ చెప్పినా, కెమెరాలు ఆఫ్ చేసినా వారిద్దరూ మరికొంత టైమ్ అలానే కొనసాగారాని సినిమా చెప్పింది.
అలాగే 'ఫ్లైయింగ్ జెట్' సినిమాలో టైగర్ ష్రాఫ్తో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ మూడుసార్లు కట్ చెప్పినా.. జాక్వెలిన్ ఆ సన్నివేశాన్ని మరికొంతసేపు కొనసాగించినట్లు సిమి చెప్పుకొచ్చారు.