
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Prashna Ravan Arrest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా కోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పిఠాపురం కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చిపడింది. బెయిల్పై రావణ్ విడుదలైన వెంటనే ఇప్పుడు మరో కేసు విషయంలో ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పిrఠాపురంలో యూట్యూబర్ ప్రశ్నపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో రిమాండ్ కోసం పిఠాపురం పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్పై బయటకు వద్దామనుకున్న ప్రశ్న రావణ్కు వెంటనే మరో ట్విస్ట్ ఎదురైంది. గతంలో కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసు విషయంలో అతడ్ని సర్పవరం పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాకినాడ జిల్లా సర్పవరంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సదరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేశారు. 2025లో ఈ కేసు నమోదైనా.. తాజాగా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే రావణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మరోమారు అతడ్ని కోర్టు ముందు హాజరు పరిచి.. రిమాండ్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రశ్న రావణ్పై ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ అదే నిజమైతే సర్పవరంలో బెయిల్ వచ్చినా.. మరో ప్రాంతం పోలీసులు అరెస్టు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై యూట్యూబర్ ఛానల్ ప్రశ్న ద్వారా రావణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అవి మరింతగా శృతిమించినట్లు కనిపిస్తున్నాయి. ప్రశ్న అనే చాటున వ్యక్తిగత దూషణలు చేసిన సంగతి వాస్తవం. అయితే ఇదే విషయమై జనసేన కార్యకర్తలు పలుమార్లు రావణ్కు సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ టైమ్లో రావణ్పై కేసు నమోదు చేసిన అరెస్టు వరకు వెళ్లలేదు.
అయితే తాజాగా పవన్ను దూషించడంతో పిఠాపురం పోలీసులు ఏకంగా హైదరాబాద్ వెళ్లి మరీ ప్రశ్న రావణ్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించి, కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు రిమాండ్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో హద్దుమీరిన విమర్శలు ఎక్కువయ్యాయని, భావప్రకటన స్వేచ్ఛ అంటే పక్క వాళ్లని దూషించడం కాదని ఆయన తెలిపారు. అలా చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, తప్పులను ఎత్తి చూపడం వరకు పర్వాలేదని చెప్పిన ఆయన వ్యక్తిగత దూషణలకు, భౌతిక దాడులకు, మత విద్వేషాలకు దిగితే నిందితులను విడిచిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.