
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ను పోలీసులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు.
ఓ కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు బుధవారం రాత్రి ఆయనను మరో కేసులో అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో ప్రశ్న రావణ్ పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని అధికారులు వెల్లడించారు.గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో 2025లో జరిగిన గొడవను కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఈ కొత్త కేసు నమోదైంది. దీనిపై ప్రశ్నించగా, తాను సమాధానాలు చెప్పనని, తన అరెస్టును కూడా యూట్యూబ్లో వీడియోలుగా అప్లోడ్ చేసి వ్యూస్ సంపాదించుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు.కాగా, జూన్ 28న ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ నిరసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురానికి చెందిన జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్లో అరెస్టయిన ప్రశ్న రావణ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్పై విడుదలైన వెంటనే పోలీసులు ఆయనను మరో కేసులో అరెస్ట్ చేయడం గమనార్హం.