
ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం చెంబూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం, వర్షాకాలానికి ముందు నగరంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.యూనివర్సల్ హైస్కూల్కు చెందిన విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై సుమారు 60 నుండి 70 ఏళ్ల నాటి రావి చెట్టు ఒక్కసారిగా కూలింది. ఈ దుర్ఘటనలో విహాన్ శ్రీవాస్తవ (11) అనే విద్యార్థి తలకు తీవ్ర గాయాలు కావడంతో, ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. బస్సులో ఉన్న మరో నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, బస్సు డ్రైవర్ స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ముంబై మేయర్ రీతూ తావడే ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.కాగా, ఈ ఘటనపై బుధవారం మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. "చెట్టు కూలడం, పిడుగులు పడటం వంటివి మన చేతుల్లో ఉండవు.. ఇది ఒక దురదృష్టకర ప్రమాదం మాత్రమే" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది సిగ్గుచేటైన, అమానవీయ ప్రకటన అని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విమర్శించింది. వర్షాకాలానికి ముందు బలహీనంగా ఉన్న చెట్లను గుర్తించి తనిఖీ చేయాల్సిన బాధ్యత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)