
AP EAPCET Results Out | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ఎప్సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) విడుదలయ్యాయి. లక్షలాది మంది
విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను eenadu.netలో చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.