
FATF సమావేశానికి ముందే పాకిస్థాన్ 'ఉగ్ర' జిమ్మిక్కులు!
ఉగ్రవాది మసూద్ అజర్పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ

ఉగ్రవాది మసూద్ అజర్పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో రన్వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిస్టారిక్ నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించేందుకు గాను బుధవారం సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసమైన మణిరామ్దాస్ ఛావనీలో ఈ భేటీ జరగనుండగా, అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఈఓ నియామకంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పదవుల భర్తీపై కూడా ట్రస్ట్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారిక ప్రకటన వెలువరించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కొహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హావరేలతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది. సెర్చ్ కమిటీ మొత్తం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, చివరకు ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ జాబితాను ట్రస్ట్కు సమర్పించింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు, కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఉండి, ప్రాక్టీసింగ్ హిందువుగా ఉన్న వారిని మూడేళ్ల కాంట్రాక్ట్ కాలపరిమితికి సీఈఓగా ఎంపిక చేయనున్నారు. ఈ సీఈఓ పదవితో పాటు ట్రస్ట్ తొలి సెక్రటరీగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జగదీశ్ ఆఫ్లే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాను కూడా ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకునే దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలు, అలాగే ట్రస్టీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం వల్ల ట్రస్ట్లో మూడు కీలక స్థానాలు ఖాళీగా

భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.తాను ఇటీవల ఉత్తరప్రదేశ్లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్తో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో తీసుకోల్సిన తదుపరి చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత వైపు వేగంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకోనున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బడి బయట ఉండిపోయిన పిల్లలను తక్షణమే గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఫలితంగా ప్రతి చిన్నారికి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను పురమాయించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు ఇతర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కొండా సురేఖ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో సురేఖ పైన నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు. పార్టీ నాయకత్వం క్రమిశిక్షణా సంఘం చేసిన సిఫారసు మీద నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే, అనూహ్యంగా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేవంత్ కంటే ముందే పార్టీ హై కమాండ్ తో భేటీ కానున్నారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారు. తాజా వివాదం వేళ పార్టీ క్రమశిక్షణా సంఘం కొండా పైన వేటు వేయాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనతో నిర్ణయం ఆలస్యం అయింది. ఆయన విదేశాల నుంచి రావటంతో కొండా సురేఖ నేరుగా ఆయన ఆప్పాయింట్ మెంట్ కోరారు. ఢిల్లీ రావాలని సూచించటంతో వెంటనే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో రేవంత్ సైతం ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి హస్తిన కు వెళ్లనున్నారు. రేవంత్ ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంలో తొలి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు.. తన వివరణ లేఖ.. తాజా పరిస్థితుల పైన చర్చించే అవకాశం ఉందని సమాచారం. తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!హైకమాండ్ నిర్ణయం వేళకాగా, అటు రేవంత్ మద్దతుగా నిలుస్తున్న నేతలు మాత్రం సురేఖతో పాటుగా చిన్నారెడ్డి పైనా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు లేఖలు రాసారు. ఇక.. రేవంత్ సైతం తన వాదన పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసారు. చర్యలు తీసుకోకుంటే పార్టీలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని సూచిస్తున్నారు. ఇక.. సురేఖ పైన నేరుగా వేటు వేయకపోయినా.. మంత్రి వర్గ

Sircilla: సబ్ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల శకం పూర్తయిందని, ఇకపై నూరు శాతం ఫలితాలు సాధించడమే అందరి లక్ష్యం కావాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయనగరం దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇప్పుడు పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.గత ఏడాది సంస్కరణల ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫలితాలతో సంతృప్తిగా లేరని, నూరు శాతం ఫలితాలనే ఆశిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా ఒక క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా వినూత్న పద్ధతుల్లో మెళకువలు నేర్పాలని సూచించారు.యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో వలస కుటుంబాలను, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను చూసి చలించిపోయానని, అప్పుడే విద్యారంగంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించుకున్నానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖ ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను నమ్ముతానని పేర్కొన్నారు.విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్ వన్ టీచర్' విధానం తెచ్చామని, డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఈ ఏడాది మరో డీఎస్సీ ద్వారా అదనంగా 3

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Sergio Gor Ladakh Visit News : డోనాల్డ్ ట్రంప్ ముఖ్య ప్రతినిధులలో ఒకరైన సెర్గియో గోర్.. తొలిసారిగా భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో పర్యటించారు. పలువురు దౌత్యవేత్తలతో కలిసి వచ్చిన ఆయన.. లడఖ్లోని ప్రసిద్ధ థిక్సే ఆశ్రమాన్ని సందర్శించి బౌద్ధమత విశేషాలను తెలుసుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావించిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో ఆయన సమావేశం.. చివరి నిమిషంలో రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భేటీ ఎందుకు క్యాన్సిల్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.దలైలామా భేటీ రద్దు వెనుక కారణమిదే..!దలైలామాతో జరగాల్సిన సమావేశం రద్దు కావడానికి గోర్ ఇటీవల కశ్మీర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇటీవలే జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సెర్గియో గోర్.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈక్రమంలోనే కశ్మీర్ను "భారత్లో అత్యంత ముఖ్యమైన భాగం" అని అభివర్ణించారు. కశ్మీర్ను సందర్శించడం ఇదే తొలిసారని, అది ఎంతో అందమైన ప్రాంతమని కొనియాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఈ కామెంట్లు కాస్త అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుని.. సెర్గియో గోర్ పేరు ప్రత్యేకంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే లడఖ్లో అమెరికా అధికారులు కాస్త వెనక్కి తగ్గి, ప్రాధాన్యత తగ్గించుకోవడానికి మొగ్గు చూపి ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి.అరగంట పాటు థిక్సే ఆశ్రమంలోనే గోర్..!లడఖ్కు చేరుకున్న గోర్.. థిక్సే ఆశ్రమంలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు. అక్కడి బౌద్ధ సన్యాసులను అడిగి బౌద్ధ ధర్మం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని లడఖ్ ప్రాంతంలో కొండపైన ఉన్న ఈ థిక్సే ఆశ్రమం.. సెంట్రల్ లడఖ్లోనే అతి పెద్దది. ఇది టిబెట్లోని ప్రసిద్ధ 'పొటాలా ప్యాలెస్'ను పోలి ఉంటుంది. లేహ్ నగరం నుంచి 19 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని 1433లో స్థాపించారు. ఇక్కడ పురాతన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు. సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా

న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్టన్నింగ్ లుక్లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
ఒకే వేదికపై విజయ్, చంద్రబాబు.. 4 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు కారిడార్, దక్షిణాది విద్యుత్ గ్రిడ్, గోదావరి-కావేరి నదుల అనుసంధానం, తిరుపతి నుంచి చార్ధామ్ వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. విభజన హామీలు, అమరావతి, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరారు. ఈ వార్తకు సంబంధించిన

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!పవన్ సంకేతాల వెనుకసమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.. అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల

తమిళనాడులోని కోవళంలో ఇవాళ నిర్వహించిన దక్షిణాది ప్రాంతీయ మండలి (Southern Zonal Council Meet) సమావేశంలో ఆతిధ్య రాష్ట ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (vijay) తన వాదన గట్టిగా వినిపించారు. మిగతా దక్షిణాది సీఎంలు అక్కడే ఉన్నా, అందులో చాలా వరకూ కాంగ్రెస్ నేతలే ఉన్నా విజయ్ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఇందులో కర్నాటక-తమిళనాడు మధ్య చిచ్చు రేపుతున్న కావేరీ అంశంతో పాటు జాతీయ స్ధాయిలో నీట్ పరీక్ష రద్దు వంటి అంశాలున్నాయి.UGC కుల వివక్ష నిరోధక రూల్స్ పై కేంద్రం యూటర్న్ ? అగ్రకులాల వ్యతిరేకత వేళ..!కర్నాటకతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విజయ్.. ఈ భేటీలో నేరుగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని విజయ్ కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు. కావేరి నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని పట్టుబట్టారు. విజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న డీకే శివకుమార్ ముఖం ఒక్కసారిగా తీవ్ర అసహనంతో మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ సమక్షంలో ముల్లపెరియార్ డ్యామ్ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచాలని విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల మధ్య ఉండే తాత్కాలిక విభేదాలు పొరుగు సంబంధాలను దెబ్బతీయకూడదని ఆయన హితవు పలికారు. మహిళా ఉద్యోగులకు విజయ్ బంపర్ ఆఫర్..! ఇక ఏడాది సెలవులు..!మరోవైపు తమిళనాడుకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రతిపాదనలను కూడా సీఎం విజయ్ ఈ భేటీలో కేంద్రానికి సమర్పించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇంటర్ లేదా ప్లస్-టూ మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బెంగళూరు మెట్రో రైలు మార్గాన్ని తమిళనాడులోని హోసూర్ వరకు విస్తరించాలని కోరారు. దీంతో
తమిళనాడు సీఎం విజయ్తో చంద్రబాబు.. ఒకే వేదికపై ఇరువురు నేతలు.. Chandrababu Vijay one stage,Tamil nadu CM Vijay Chandrababu,31st Southern Zonal Council meeting,Mahabalipuram South Zonal meeting,Andhra Pradesh News,చంద్రబాబు,విజయ్,ఒకే వేదికపై చంద్రబాబు విజయ్,తమిళనాడులో చంద్రబాబు,31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ వార్తకు సంబంధించిన

‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. ఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో తన ప్రసంగం అనంతరం చోటుచేసుకున్న ‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హల్ద్వానీలో తాను ప్రసంగించిన వేదికను అనంతరం ‘శుద్ధి’ చేశారనే అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి ఖర్గే వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగించిన వేదికను కొందరు ‘ప్రక్షాళన’ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఖర్గే గతంలో బహిరంగంగానే స్పందించారు. తన ప్రసంగం అనంతరం అదే ప్రదేశంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన కుల వివక్షకు సంబంధించినదిగా పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై పార్టీకి చెందిన పలువురు నాయకులు తనకు మద్దతుగా స్పందించకపోవడం ఖర్గేను బాధించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు ఇలాంటి సందర్భంలో నేతల నుంచి మద్దతు ఉంటుందని ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సొంత పార్టీ నేతల మౌనం తనను నిరాశకు గురిచేసిందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ..ఆరెస్సెస్ అగ్ర నేతలు విశాఖలో మకాం వేసారు. కీలక మంత్రాంగం కొనసాగుతోంది. అటు పార్టీ.. ఇటు సంఘ్ సంస్థల మేధో మధనం మొదలైంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న ఈ సమావేశాల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. దక్షిణాదిలో పట్టు పెంచుకునే దిశగా కొంత కాలంగా సాగుతున్న ప్రణాళికల్లో భాగంగా.. ఇప్పుడు జరుగుతున్న ఈ భేటీలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.మిషన్ 2029. అందులో భాగంగా ఢిల్లీ కొత్త కార్యచరణ అమలు చేస్తోంది. ఈ సారి అధికారం దక్కా లంటే దక్షిణాది లో పట్టు పెంచుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ముందస్తు వ్యూహా లను అమలు చేస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్ అగ్ర నాయకత్వం విశాఖలో మకాం వేసింది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ విశాఖలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇప్పుడు తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో జరుగుతున్నాయి. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్, గౌరవ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాళే తో పాటుగా సంఘ్ ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పంచ పరివర్తన్ అమలుపై కీలకంగా చర్చిస్తారు. సామాజిక, జాతీయ భద్రతా అంశాలపై సమీక్షించనున్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు..!!దక్షిణాది రాష్ట్రాల పై స్పెషల్ ఫోకస్ఇక, విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఆయన ఆరెస్సెస్ సమావేశాలకు హాజరు కానున్నారు. దక్షిణాదిలో.. ఏపీలోనూ పార్టీ బలోపేతం పైన పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. పొత్తులు.. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంగా సూచించారు. స్థానిక సంస్థల్లో అవకాశం సద్వినియోగం చేసుకోవాలని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ సొంతంగా

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. ఆ క్రమంలో ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనపై కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్లోని ఆర్థిక అంశాల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దుగరాజుపట్నం పోర్టు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఆయన కోరనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంశాన్ని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సహకారానికిగాను కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిగిలిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిధులు సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

భారత్లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న సెర్గియో గోర్ శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ సమస్యల పరిష్కారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని, వాషింగ్టన్ నుంచి కాదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను యూఎస్ రాయబారి ముందు ఉంచబోనని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. "మా సమస్యలకు పరిష్కారం వాషింగ్టన్ నుంచి రాదు. మా సమస్యలను మన కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి" అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో అమెరికా రాయబారి చెప్పే విషయాలను వినడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై వైట్ హౌస్ ముందు నిరసన తెలుపుతానంటూ ఒమర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా దౌత్యపరమైన స్పష్టత ఇచ్చారు. గత 15 ఏళ్లలో ఒక అమెరికా రాయబారి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇది రెండోసారి మాత్రమే. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ జరిగిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీనగర్ పర్యటన అనంతరం సెర్గియో గోర్ లడఖ్లో కూడా పర్యటించనున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ వివాదం తర్వాత అమెరికా రాయబారి లడఖ్ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి

Nirmal: కొండపేటలో రైతులతో అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక అవగాహన సదస్సు! ఈ వార్తకు సంబంధించిన

ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ రోజు (బుధవారం) ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరవ్వనున్న ఆయన.. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అధికారికంగా పలు సమావేశాలు.. విశ్వ విద్యాలయా ల్లో భేటీలు జరగనున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ లో పార్టీ అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ తరువాత విదేశాలకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకే, యూఎస్ లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో పాటు వెళ్తున్నారు. 11 రోజుల పర్యటన అనంతరం ఈనెల 30న వారు హైదరాబాద్కు చేరుకుంటారు. యూకే పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మరియు లండన్ యూనివర్సిటీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అలాగే, ప్రసిద్ధ బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శించడంతో పాటు, ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్కు హాజరవుతారు. 24-కోచ్ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!వరుస సమావేశాలు.. నిర్ణయాలుఈ నెల 23న ఆగస్టు 23న ఆయన అమెరికాకు పయనం కానున్నారు. అమెరికాలో హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్ల సందర్శన అమెరికాలో తన పర్యటనలో భాగంగా బోస్టన్లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ మరియు ఎంఐటీ క్యాంపస్లను సీఎం సందర్శిస్తారు. అంతేకాకుండా, నార్త్ఈస్టర్న్ మరియు వర్జీనియా టెక్ యూనివర్సిటీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. ఈ విదేశీ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఆగస్టు 27

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీగా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, కాల్వలు, విద్యుత్ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ.7,469.46 కోట్ల పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్-2 పనులకు రూ.1,323.75 కోట్లను కేటాయించింది. శ్రీసత్యసాయి జిల్లాలో మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్ కెనాల్ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 200 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా అనుమతించింది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000 మెగావాట్ల హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ లిమిటెడ్కు 433.30 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులో రూ.85,200 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1,880 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రూ.31,387 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ అంగీకరించింది. తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో బ్యాటరీ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది. చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెట్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి మండలికి అధికారులు వివరించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్లను 28 జిల్లా పరిషత్లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. సకాలంలో ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను భారీగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. గురువారం (ఆగస్టు 20) తమిళనాడులో నిర్వహిస్తున్న ' సదరన్ జోనల్ కౌన్సిల్ ' సమావేశం దీనికి వేదిక కానుంది. తొలిసారి ఏపీ, తమిళనాడు సీఎంలు ఒకే వేదికపై కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం చెన్నైలో నిర్వహిస్తుండటంతో తమిళనాడు సీఎం విజయ్ కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది. ఆగస్టు 20న తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ , కర్ణాటక ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, అంతర్రాష్ట్ర మండలి సచివాలయ కార్యదర్శి, రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు సహా పలు కీల అంశాలపై చర్చించనున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తమిళనాడు వెళతారు. సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు.. రాత్రికి చెన్నైలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ రిసార్ట్లో బస చేస్తారు. గురువారం (ఆగస్టు 20) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం చెన్నై నుంచి బయల్దేరి విజయవాడ ఎయర్పోర్ట్కు చేరుకుంటారు.. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి వెళతారు.30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరువనంతపురంలో జరిగింది.. అక్కడ మొత్తం 26 అంశాలపై చర్చించగా.. తొమ్మిది అంశాలకు పరిష్కారం లభించగా.. మరో 17 అంశాలను తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. ఈ 17 అంశాల్లో 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వీటిని విజయవంతం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. విభాగాధిపతులకు అవసరమైన ఆదేశాలను ఇస్తూ వస్తోంది.ఈ క్రమంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలను విరాళంగా అందిస్తున్నదాతలతో సమావేశం అయ్యారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రాబోతోన్నందున కూరగాయల సరఫరా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.శ్రీవారి అన్న ప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం సగటున 13 నుంచి 14 టన్నుల బియ్యం, ఎనిమిది టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూరడం గొప్ప విషయమని అన్నారు.Tirumala: తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీగత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల నుంచి 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను సమకూరుస్తున్నారని వివరించారు. అన్నప్రసాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని, నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.తిరుమలలో ముమ్మరంగా ట్రైన్ ది ట్రైనర్స్కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవి కావడం వల్ల వాటిని నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని వినియోగించుకుంటోన్నట్లు వెంకయ్య చౌదరి వివరించారు. మూడేళ్ల కిందటి

Nalgonda: నల్గొండలో డ్రగ్స్ నివారణపై అదనపు కలెక్టర్ సమీక్ష ఈ వార్తకు సంబంధించిన

లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖపట్నం, ఆగస్టు18: కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మంచి పాలన అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమికి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కూటమి ఏర్పాటైందని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అంధ్రప్రదేశ్పై ప్రధాన మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. తమ కలలను సాకారం చేసే పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తుందని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. దీనిని తిప్పి కొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు నేషనల్ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో నిరాశ కనపడుతోందని

ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. అమరావతి, ఆగస్టు 18: ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే రూ.12150 కోట్లు అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. న్యాయ పరిధిలో 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను తర్వాత చూసుకుందామని.. ముందైతే అన్నింటిలోనూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మద్యం బ్రాండ్లు పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపుకు యత్నిస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ

గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న అశోక్ గజపతి రాజు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో భాగంగా ఆయన ప్రధానిని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్రత్యేకంగా కోరారు. ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున పంపిన ఆహ్వాన పత్రికను అందజేస్తూ, సింహాద్రి అప్పన్న ప్రత్యేక విగ్రహాన్ని ప్రధానికి బహుమతిగా సమర్పించారు. గత ఏడాది కాలంగా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు విజయవంతంగా సేవలందిస్తున్నారు. తన పదవీకాలంలో సాధించిన పురోగతిని, బాధ్యతలను వివరిస్తూ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 17న జరిగిన ఈ సమావేశం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వీకరించి, సింహాచలం ఆలయాన్ని తప్పక సందర్శిస్తానని హామీ ఇచ్చారు. తన షెడ్యూల్ను బట్టి త్వరలోనే అప్పన్న స్వామిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సింహాచలం క్షేత్రంలో ప్రధాని పర్యటనపై భక్తులలో, స్థానికులలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక అంశాలతో పాటు గోవా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధానితో ఆయన చర్చించారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఫలితంగా గోవాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందుతున్న నిధుల వినియోగంపై కూడా వారు సమీక్షించారు. గోవా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వస్తున్న సవాళ్లను గవర్నర్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక చొరవపై అశోక్ గజపతి రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైతే, ఆయన పర్యటనలో సింహాచలం క్షేత్రం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అప్పన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే.. స్పష్టంచేసిన సీఎం పంచాయతీరాజ్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో మూడో వంతు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలో స్థానిక ఎన్నికలు అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. అలాగే... స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27శాతం వాటా ఇవ్వాలని సిఫారసు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీనిని దృష్టిలో పెట్టుకునే 27 శాతానికి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే. అయినప్పటికీ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్లో... రాత్రి మరోసారి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలురకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చివరికి... 34 శాతంపై ముందుకే వెళ్లాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ... బీసీలకు 34 శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా

Parkal: నిరుద్యోగులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం! ఈ వార్తకు సంబంధించిన

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్కు 44 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయడం, సంస్థాగత విస్తరణ, ఎన్ఆర్ఐ నెట్వర్క్ బలోపేతమే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజాను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం తెర వెనుక విశేష కృషి చేసిన డాక్టర్ రాజా సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించి ఆయనకు ఈ పదవి అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్వర్క్ను నిర్మించే దిశగా ఆయన తొలి అడుగు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాల సెంట్రల్ కమిటీ మీటింగ్ను నేడు జరిగింది. డాక్టర్ రాజా నిర్వహించిన ఈ తొలి జూమ్ మీటింగ్కు 44 మంది సభ్యులు హాజరయ్యారు. తమను తాము పరిచయం చేసుకున్న తర్వాత మీటింగ్ అజెండా ప్రకారం వారు మాట్లాడారు. గ్లోబల్ కమిటీ ఏర్పాటు ఆవశ్యకతను డాక్టర్ రాజా వివరించారు. 2029 ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ఎన్ఆర్ఐలు ఏవిధంగా పని చేయాలి అన్న విషయంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ్యుల నుంచి సలహాలు స్వీకరించిన రాజా పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ, ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ విజన్ వంటి అంశాల గురించి ఆయన దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్నారై టీడీపీ విధివిధానాలు, ఎవరి పాత్ర ఏమిటి, ఎవరెవరి బాధ్యతలు ఎలా ఉంటాయి అన్న విషయాలను కూలంకషంగా తెలిపారు. తొలి త్రైమాసికంలో కార్యచరణ, ప్రాధాన్యాల గురించి ఆయన మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో పర్యటించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందు లో భాగంగా ఏపీలో పార్టీ పటిష్ఠత పైన కొత్త టాస్క్ ఫిక్స్ చేస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీలో అయిదు రోజులు మకాం వేయనున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసి.. ఏపీలో పార్టీ భవిష్యత్ లక్ష్యాల పైనా స్పష్టత ఇవ్వనున్నారు.పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీకి వస్తున్నారు. అయిదు రోజుల పర్యటన ఫిక్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలతో పాటుగా.. పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా, ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సాగుతూనే.. పార్టీ బలోపేతం పైన మేధో మథనం చేస్తున్నారు. ఇందు కోసం నేరుగా పార్టీ చీఫ్ రంగంలోకి దిగుతున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్ కి బీజేపీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సిద్దం, ముహూర్తం ఫిక్స్..!!విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ మంత్రాంగంఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం తమకు దక్కాల్సిన సీట్ల పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణాలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. పొత్తుల్లో

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై వైసీపీపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారని అన్నారు. వైసీపీ కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతుందని ఆగ్రహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి రాకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలని.... పారిపోకూడదని అన్నారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. zoom call layoff: నేనే బాస్ నన్నేవడూ పీకలేడు అని విర్రవీగితే.. విశాల్ గార్గ్ కు పట్టిన గతే పడుతుంది. ఆన్ లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగులను ఒక్క జూమ్ కాల్ తో తొలగించేశారు. 2021లో భారత సంతతికి చెందిన సీఈవో విశాల్ గార్గ్ 900 మంది ఉద్యోగులను ఒకే ఒక దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే మరోసారి విశాల్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందికి పీకిపడేసిన విశాల్ ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈవో జాబ్ నుంచి తొలగించిన తర్వాత తిరిగి తీసకోవాలని సంస్థ బోర్డును వేడుకుంటున్నాడు. Better.com వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన గార్గ్ ను ఆగస్టు 3న సీఈవో పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్ ను కొత్త సీఈవోగా నియమించారు. విశాల్ గార్గ్ ఆరోపిస్తుంది ఏంటంటే.. డేనియల్ లూయిస్ తొలత సంస్థ వ్యూహం పై ఆసక్తి చూపిస్తూ.. తన విశ్వాసాన్ని పొందారు. ఖర్చులను తగ్గించడం, కంపెనీ లాభదాయకంగా మార్చడం వంటి అంశాలపై 6 నెలల క్రితం గార్గ్ తో చర్చలు జరిపారు. అయితే చివరికి బోర్డులోకి ప్రవేశించి.. ఇతర డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తనను సీఈవో పదవి నుంచి తప్పించారని గార్గ్ ఆరోపణలు చేశారు. లూయిస్ ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగానే ఉన్నాయి..కానీ ఆయన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అంతగా నచ్చలేదని గార్గ్ చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. జూలై 27న లూయిస్ ను కంపెనీ బోర్డులోకి తీసుకున్న కేవలం వారం రోజుల్లోనే ఇతర డైరెక్టర్లను ఒప్పించి విశాల్ గార్గ్ ను

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత ప్రతిపక్షాల మాయలో పడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా కొందరు మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన సీఎం, ఇది కేవలం కాగితం ముక్క కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు అని అన్నారు. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చి స్కామ్లు చేస్తే, తాము సన్నబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల పేరుతో గతంలో నాసిరకం పంపిణీ చేస్తే, తాము పాలపిట్ట, చిలకపచ్చ రంగు చీరలతో మహిళల గౌరవం పెంచామని తెలిపారు.ప్రతిపక్ష బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బాగుపడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోర పూజలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడు ఆలయాల్లో అర్ధరాత్రి చేసిన పూజల రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.తాము మంజూరు చేసిన 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్ వారు కట్టిన డబ్బా ఇళ్ల వద్ద ఓట్లు అడగగలరా?
ఆంధ్రప్రదేశ్లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో కీలక అడుగు పడింది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో సుమారు రూ.16 వేల కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసే అంశంపై అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో లభించే బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.కేవలం ఖనిజాలను మాత్రమే వెలికితీసి విక్రయించడం కాకుండా.. వాటిని రాష్ట్రంలోనే ప్రాసెస్ చేసి ఫైనల్ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వాలని సీఎం చంద్రబాబు.. అదానీ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. బీచ్శాండ్లో లభించే ఇల్మెనైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా టైటానియం స్లాగ్, టైటానియం డయాక్సైడ్, టైటానియం స్పాంజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చని అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది.వాటికి పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్, పాలిమర్స్, యూవీ ప్రొటెక్షన్ ఉత్పత్తుల వంటి రంగాల్లో వినియోగం ఉంటుందని ముఖ్యమంత్రికి వివరించారు. అరుదైన భూఖనిజాల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించేందుకు రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు.. సంబంధిత అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక భాగస్వామ్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.టైటానియం ప్లాంట్కే పరిమితం కాకుండా విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులపై కూడా అదానీ గ్రూప్ ప్రతినిధులు వివరాలు అందించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, వెయ్యి పడకల అదానీ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు అదానీ గ్రూప్ వివరించినట్లు సమాచారం.అదే సమయంలో విశాఖలో

జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది. హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే అంశాన్ని తొలగించాలని కోరింది. తెలంగాణ ప్రాజెక్టుల TAC అనుమతుల వివరాల అంశం కూడా వద్దని తెలిపింది. CWC-TAC, MoJS ఇచ్చిన అనుమతుల సమీక్ష అంశంపైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే జీఆర్ఎంబీలో విస్తృతంగా చర్చించామని వెల్లడించింది. గతంలో ఏపీ అభ్యంతరాలను CWC పరిశీలించి తిరస్కరించిందని తెలంగాణ సర్కార్ వాదించింది. GWDT అవార్డు, CWC మార్గదర్శకాల ప్రకారమే ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మూడు అంశాలను అజెండా నుంచి డ్రాప్ చేయాలని జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. సవరించిన అజెండా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్రెడ్డి పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు. అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది. మండలిలో పార్టీ

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టార్చ్లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్ తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!

తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరవుతామని తెలిపారు. నీటీ వాటాపై బలంగా కొట్లాడుతామని పేర్కొన్నారు. అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ ఫాం హౌస్లో పండిన వరికి వచ్చిన ధర ఎంతో చెప్పాలంటూ కేటీఆర్ను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తాము కోటిన్నర రూపాయిలకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. 5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు. హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలను భయపెట్టడం కేటీఆర్కు మంచిది కాదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడికి హితవు పలికారు. తమపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని ఆయనకు సూచించారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేద పేర్కొన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు

దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యం టాటా గ్రూప్లో ఊహించని భారీ పరిణామాలు ప్రారంభమయ్యాయి. టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న జరగనున్న అత్యంత కీలకమైన టాటా గ్రూప్ వార్షిక జనరల్ బాడీ సమావేశానికి కొద్దిరోజుల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం దేశీయ వ్యాపార రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉండటంతో, అప్పటివరకు మాత్రమే బాధ్యతల్లో కొనసాగుతానని, ఆ తర్వాత చైర్మన్గా మళ్లీ అవకాశం కోరబోనని ఆయన స్పష్టం చేశారు.రాజీనామా వెనుక అసలు కథ1987లో సాధారణ ఉద్యోగిగా టీసీఎస్లో ప్రస్థానం ప్రారంభించి, 2017లో దివంగత రతన్ టాటా ఆశీస్సులతో గ్రూప్లోనే అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న మొదటి నాన్-టాటా ఫ్యామిలీ లీడర్ చంద్రశేఖరన్. అయితే, గత కొంతకాలంగా గ్రూప్లో ప్రధాన భాగస్వామి అయిన టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ మధ్య కొన్ని విధానపరమైన విషయాల్లో తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి.టాటా సన్స్ కు భారీ దెబ్బ: Air India లో పెను తుఫాను! విల్సన్ ఔట్!కంపెనీ అప్పుల తగ్గింపు, టాటా సన్స్ను పబ్లిక్ లిస్టింగ్ చేయకుండా చూడటం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్తో ఉన్న పాత వివాదాల పరిష్కారం వంటి అంశాలపై నోయెల్ టాటా గట్టి హామీలు కోరినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే చంద్రశేఖరన్ తప్పుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.బిగ్ ఇంపాక్ట్: కుప్పకూలిన టాటా గ్రూప్ షేర్లు!చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రావడమే ఆలస్యం, స్టాక్ మార్కెట్లలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ షేరు విలువ ఏకంగా 4 శాతం మేర క్షీణించగా, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ షేర్లు కూడా భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొనడంతో బెంచ్ మార్క్ సూచీలపై ఈ ప్రభావం స్పష్టంగా