
FATF సమావేశానికి ముందే పాకిస్థాన్ 'ఉగ్ర' జిమ్మిక్కులు!
ఉగ్రవాది మసూద్ అజర్పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ

ఉగ్రవాది మసూద్ అజర్పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు ఏకంగా 97,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,108 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది.టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.61 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 4.22 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,757 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా.. సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని, స్వామివారి ఆలయం, పరిసరాల ఆధునీకరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా తిరుమలలోని అత్యంత పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధిఈ తనిఖీ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి వద్ద చేపట్టాల్సిన భద్రతాపరమైన మార్పులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేదా ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు తగిన రక్షణ గ్రిల్స్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని స్పష్టం

నేడు.. వరల్డ్ లయన్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ప్రపంచ సింహాల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సింహాలు.. ప్రత్యేకించి అరుదైన ఆసియాటిక్ లయన్ తో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశం. భారత్ లో వరల్డ్ లయన్ డే ను జరుపుకొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జులాజికల్ పార్క్ లల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.జూపార్క్ లల్లో సింహాల సంరక్షణ ఎలా ఉంటుంది, వాటి రోజువారీ అలవాట్లు ఏమిటనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో కూడా శనివారం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక సదస్సులో జూ సిబ్బంది, యానిమల్ కీపర్లు నేరుగా సందర్శకులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా జాతి సింహాల జీవన విధానం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నారు.సింహాల రోజువారీ సంరక్షణ ఎంత సవాల్ తో కూడుకున్నదో సందర్శకులకు వివరించారు యానిమల్ కీపర్లు. అడవుల్లో స్వేచ్ఛగా విహరించే సింహాలను జూ వాతావరణంలో ఉంచడం అనేది అత్యంత సవాల్ తో కూడుకున్నదని తెలిపారు. వాటికి ఆహారాన్ని అందించే విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు., వాటిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ టికెట్ రేట్లు అద్దిరిపోయాయ్: వ్లాగర్లకు మరీనూ !!సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్ల వంటి వన్యప్రాణులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వీటికి ఏటా ఫెలైన్ డిస్టెంపర్ వ్యాక్సిన్ను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అందిస్తామని చెప్పారు. జూ రికార్డుల ప్రకారం ప్రతి ఏటా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా చేపడుతుంటామని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింహాల ప్రాముఖ్యతను వివరించారు.నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా..: సీఎం రేవంత్ రెడ్డి రాకఅంతరించిపోతున్న ఈ వన్యప్రాణుల జాతులను కాపాడుకోవలసిన బాధ్యత