
బి.డెస్లోప్రవేశానికి నమోదుప్రక్రియప్రారంభం
దేశంలోని ప్రముఖ డిజైన్ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (nid) 2027-28 విద్యా సంవత్సరానికి బి.డెస్కు మరియు 5.5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎమ్.డెస్కు

దేశంలోని ప్రముఖ డిజైన్ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (nid) 2027-28 విద్యా సంవత్సరానికి బి.డెస్కు మరియు 5.5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎమ్.డెస్కు

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు

ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం, భవిష్యత్ వ్యాపారాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది (Uber layoffs 2026). గత ఏడాది చివరి నాటికి ఉబర్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్తో ఉద్యోగుల సంఖ్య 30 వేల కంటే దిగువకు చేరనుంది. 2021లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో దాదాపు అదే స్థాయికి ఇప్పుడు చేరనుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఉబర్ చేపడుతున్న అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. 2020 మేలో కరోనా కారణంగా రైడ్ హైలింగ్ డిమాండ్ కుప్పకూలడంతో కంపెనీ సుమారు 6,700 ఉద్యోగాలను తొలగించింది (Uber job cuts). ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలోని మేనేజర్ల సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు (Uber manager layoffs). అయితే వీరందరూ ఉద్యోగాలు కోల్పోతారని కాదు. కొంతమంది మేనేజర్లను మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తొలగించి వేరే పాత్రల్లోకి మార్చనున్నారు. ఉద్యోగాల కోత మాత్రం మేనేజర్లకే పరిమితం కాకుండా ఇతర ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది. సంస్థను మరింత సరళంగా, వేగంగా మార్చడమే తాజా పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా. మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని లోకలే మేలు... ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్తో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంట, వాపును తగ్గిస్తాయని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం కూడా లభిస్తుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే మంట, వాపు నుంచి రక్షణ లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే మంట వాపు, తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథాల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మంట, వాపు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో పాటుగా విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. టమాటాలు తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్లో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు తింటే వాపు, మంట తగ్గుతుంది

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్ఫ్రూట్లో విటమిన్ సి, ఫోలేట్తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలి మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారు, ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఎపి కృషిని కేంద్రప్రభుత్వం అభినందించినట్లు అధికారులు తెలుపగా, మంత్రి లోకేష హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుంది, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25లక్షలమందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27లక్షలమంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం 11 ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం. మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు. దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'. మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో తీసుకోల్సిన తదుపరి చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత వైపు వేగంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకోనున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బడి బయట ఉండిపోయిన పిల్లలను తక్షణమే గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఫలితంగా ప్రతి చిన్నారికి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను పురమాయించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు ఇతర

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్క్వార్టర్స్లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్క్వార్టర్స్తో పాటు ఎయిర్ హెడ్క్వార్టర్స్లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్కు కమాండింగ్ ఆఫీసర్గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25 Problems: నల్గొండ-హైదరాబాద్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ (SGT)లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు పునాది వంటి ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు, మౌలిక వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడులు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బ్రతికించుకోవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు (SGT) విజ్ఞప్తి చేస్తున్నారు. జీఓ నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 నుండి 5 తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరినే ఉపాధ్యాయుడిగా ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 4,800 పాఠశాలలు ఒక్క టీచర్తోనే నడుస్తున్నాయని వాపోతున్నానరు. 21 నుండి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లను ఇస్తున్నారు. కానీ, ఇద్దరు టీచర్లు ఒకే సమయంలో ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం అసాధ్యంగా మారింది. దీనినే బహుళ తరగతి బోధన అని పిలుస్తున్నప్పటికీ, ఆచరణలో ఇది విఫలమవుతోందని.. దీనివల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం: పాఠాలు చెప్పడంతో పాటు ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్రమైన బోధనేతర భారం మోపుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ యాప్లలో విద్యార్థుల, ఉపాధ్యాయుల

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం సాయంత్రం రెండో ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి 26వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ లిస్ట్, సెలక్షన్ జాబితాలను విడుదల చేస్తారు. ఈ పోస్టుల భర్తీ కోసం 2023 జులై 26న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 14న ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జులై 10న తొలి తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేశారు. మరోసారి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించాక తాజాగా రెండో తాత్కాలిక జాబితాను విడుదల చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హైదరాబాద్లోని వెంగళరావునగర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు వెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఈ నెల 28వ తేదీని రిజర్వ్డేగా నిర్ణయించారు. తమకు కేటాయించిన తేదీన వెరిఫికేషన్కు హాజరు కాలేకపోయిన వారు ఆ రోజు వెళ్లే అవకాశం కల్పించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్ నగరం గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా ఎదిగే క్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక 'యూనివర్సిటీ ఆఫ్ లండన్', అమెరికాలోని బోస్టన్కు చెందిన 'నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ' తమ ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం బ్రిటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో, అధికారుల బృందం అగ్రరాజ్యంలో పర్యటించింది. ఈ పర్యటనల్లో భాగంగా నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చలు సఫలీకృతం కావడంతో, ఈ ప్రఖ్యాత విద్యాసంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించాయి.వీటితో పాటు, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైతం తెలంగాణలో స్వల్పకాలిక 'ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు', విభిన్న కోర్సులను అందించేందుకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలతో జరిపిన చర్చలు కూడా ఫలవంతమయ్యాయి.ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

పట్నా: బిహార్లో ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో అక్కడి సమస్తిపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. పేద, దళిత బస్తీకి చెందిన చిన్నారులు కనీస సౌకర్యాలు లేకుండా ఈ బడిలో చదువుకుంటున్నారు. సమస్తిపూర్ నగరంలోని బీఈడీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు కనీస విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. పక్కా తరగతి గదులు లేకపోవడంతో పిల్లలు గుడిసెలాంటి రెండు గదుల్లో నేలపై కూర్చొని చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదు తరగతులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో 1, 2, 3 తరగతుల పిల్లలకు కలిపి బోధిస్తున్నారు. మరో గదిలో 4, 5 తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా నేలపైనే కూర్చుంటున్నారు. సరైన బెంచీలు, డెస్కులు లేవు. బ్లాక్బోర్డు కూడా సరిగా లేదు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేకపోవడంతో తరగతి గదుల్లో వేడి, ఉక్కపోతతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాముల భయం పాఠశాలలో విద్యార్థులు పాముల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పాఠశాలలో సరైన బెంచీలు, డెస్కులు లేకపోవడంతో పిల్లలు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో పాములు లోపలికి వస్తే వారిని కరిచే ప్రమాదం ఉంది. పాఠశాల చుట్టుపక్కల పాములు కనిపిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెలాంటి నిర్మాణం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా పిల్లల్లో భయం నెలకొంది. తమ చిన్నారులను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన పాఠశాలలోనే పాముల భయం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యం, అధికారులు

Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

భారతీయ సినిమా ఎనీ టైం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శక మార్క్ ఎప్పుడూ ప్రత్యేకమే. సెన్సిటివ్ ఎమోషన్స్, విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టడంలో దిట్ట. ప్రెజెంట్ యుగంలో రావాల్సిన కధాంశంతో కూడిన చిత్రాలని ఇరవై ఏళ్ళ క్రితమే తెరకెక్కించాడు. ప్రస్తుతం వర్సటైల్ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాబోయే 2027 పొంగల్ (సంక్రాంతి) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన లీక్డ్ పిక్చర్స్, వేగంగా జరుగుతున్న షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రేక్షకులకి ఈ మూవీ ఒక మరపురాని అనుభూతిని అందించబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, సాయిపల్లవి సహజ నటన, మణిరత్నం టేకింగ్, రెహమాన్ సంగీతం కలగలిసిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్ర బృందం కోల్కతాలోని ప్రసిద్ధ హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకోగా అక్కడ విజయ్ సేతుపతి, సాయిపల్లవిలపై చిత్రీకరించిన లీక్డ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2018లో వచ్చిన విజయ్ సేతుపతి క్లాసిక్ హిట్ '96' వైబ్స్ను ఈ లీక్డ్ పిక్చర్స్ గుర్తుచేస్తున్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోల్కతా షెడ్యూల్ తర్వాత తదుపరి చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. సాధారణంగా భారీ సినిమాల చిత్రీకరణకి నెలల తరబడి సమయం పడుతుంది, కానీ మణిరత్నం మాత్రం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ విజువల్ మ్యాజిక్కు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్
నిమ్మరసంలోని విటమిన్ సి, బ్లీచింగ్ గుణాలు మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే కొద్దిగా నిమ్మరసం తీసుకుని మోకాళ్లపై బాగా రుద్దండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. బంగాళాదుంపలోని ఎంజైమ్స్ మోకాళ్లను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీనికోసం బంగాళాదుంప ముక్కతో మోకాళ్లకు మర్దన చేయండి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మోకాళ్ల దగ్గర ఏర్పడిన నల్లటి ట్యాన్ తొలగించడంలో పసుపు, పాలు సహాయపడతాయి. దీనికోసం పసుపులో కొద్దిగా పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు. బేకింగ్ సోడా కూడా మోకాళ్ల నలుపు ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. అలోవెరా మోకాళ్ల నలుపు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరాను మోకాళ్లకు రాసుకుని పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. కొబ్బరి నూనెలో కొద్దిగా చక్కెర కలిపి మోకాళ్లకు రాసుకోండి. ఇది నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి మోకాళ్ల నలుపు పోగొడుతుంది. కీరదోస గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మోకాళ్లకు రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే మోకాళ్లు తెల్లగా మారుతాయి. బేకింగ్ సోడాలో పాలు కలిపి మోకాళ్లకు రాసుకోండి. పావుగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది. గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత మోకాళ్లకు రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నలుపు ఈజీగా పోతుంది

హైదరాబాద్ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది. ఈ విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (MoUs), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ నగరాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ప్రకారం అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్లోనే తమ తొలి ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది. దీనికితోడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్లోని డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ అంతర్జాతీయ కోర్సులు రాబోయే నవంబర్ నెల నుంచే నగరంలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), ఆక్స్ఫర్డ్

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి ఆ నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకుపోయారు. వారిని జిల్లా అధికారులు రక్షించారు. మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది. వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయండి. ఈ నీటిని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. దీంతో చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ను నీటిలో కలిపి పుక్కిలించండి. 30 సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. కలబంద రసాన్ని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. స్వచ్ఛమైన కలబంద జెల్ వాడితే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. పసుపును కొద్దిగా చిగుళ్లకు రాయండి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును కంట్రోల్ అవుతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్లాగా తయారు చేయండి. దీన్ని రాయడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. జామ ఆకుల రసాన్ని లేదా జామ ఆకులు మరిగించిన నీటిని మౌత్వాష్గా ఉపయోగించండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ను పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గుతుంది

రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల శకం పూర్తయిందని, ఇకపై నూరు శాతం ఫలితాలు సాధించడమే అందరి లక్ష్యం కావాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయనగరం దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇప్పుడు పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.గత ఏడాది సంస్కరణల ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫలితాలతో సంతృప్తిగా లేరని, నూరు శాతం ఫలితాలనే ఆశిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా ఒక క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా వినూత్న పద్ధతుల్లో మెళకువలు నేర్పాలని సూచించారు.యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో వలస కుటుంబాలను, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను చూసి చలించిపోయానని, అప్పుడే విద్యారంగంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించుకున్నానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖ ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను నమ్ముతానని పేర్కొన్నారు.విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్ వన్ టీచర్' విధానం తెచ్చామని, డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఈ ఏడాది మరో డీఎస్సీ ద్వారా అదనంగా 3

రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రకటించారు. విద్యామంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు ఇందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు (శనివారం) విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలి.. విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తి అయ్యాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇక పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టిసారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. సంస్కరణల కారణంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఇది తొలిమెట్టు మాత్రమేనని అన్నారు. నూరుశాతం ఫలితాల సాధనపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా మెళకువలు నేర్పాలని దిశానిర్దేశం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ సంస్కరణల ఆలోచన.. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలను చూశానని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గమనించాను. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆనాడే నిర్ణయించుకున్నా. అత్యంత సవాళ్లతో కూడిన
ఒంట్లో వేడి సమస్య ఉంటే నోటి పుండ్లు, మూత్రంలో మంట, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అలాగే చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోండి. ఒంట్లో వేడి సమస్యతో బాధపడేవారు వీలైనంత ఎక్కువగా నీళ్ళు తాగడం మంచిది. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేట్గా, కూల్గా ఉంటుంది. వేడి తగ్గుతుంది. శరీరాన్ని కూల్ చేసి వేడి నుంచి ఉపశమనం కల్పించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అలాగే ఈ నీళ్లలోని ఎలక్ట్రోలైట్స్ మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి మజ్జిగా సహాయపడుతుంది. మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం ద్వారా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస, తర్భూజ, బత్తాయి,నారింజ, దానిమ్మ వంటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లు, సోంఫు నీళ్లు, మెంతుల నీళ్లు బాడీని డీటాక్సిఫై చేయడమే కాకుండా ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వేడి సమస్య ఉన్నవారు ఈ చిట్కా పాటించొచ్చు. పుదీనాలోని మెంథాల్ బాడీని కూల్ చేస్తుంది. దీనికోసం పుదీనా ఆకులు వేసిన నీళ్లు తాగొచ్చు. లేదంటే పుదీనాతో టీ చేసుకుని తాగొచ్చు. ఐస్ ప్యాక్ లేదా శుభ్రమైన క్లాత్లో ఐస్ క్యూబ్స్ చుట్టి మణికట్టు, నుదురు, మెడ వంటి ప్రాంతాల్లో కాసేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. ఒంట్లో వేడి సమస్య ఉన్నవారు కారం, మసాలా ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి. రోజుకు సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి
కాఫీ తాగితే కాలేయంలో అసాధారణ ఎంజైమ్లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, ఫైబ్రోసిస్ తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గిస్తాయి. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయం దగ్గర కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్మీల్ తింటే ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అవకాడో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అల్లిసిన్ కూడా లభిస్తుంది. వెల్లుల్లి తింటే కాలేయ కొవ్వు కరుగుతుంది. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ. రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా
తెలంగాణను ప్రపంచ స్థాయి ఎడ్యూకేషన్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్షిప్పై కన్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్షిప్తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్లన్నీ భారత్లోనే జరగనున్నాయి. భారత్కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కుల్దీప్ యాదవ్పై వారికి

వంట పూర్తయ్యాక ఒక్కసారి రుచి చూస్తే ఉప్పు కాస్త ఎక్కువైందని తెలిసి గుండె ఆగినంత పనవుతుందా? రోజూ ఎంతో ఇష్టంగా వండే కూరలు లేదా ఫ్రైలలో పొరపాటున ఉప్పు ఎక్కువ కావడం సర్వసాధారణం. అయితే ఉప్పు ఎక్కువైందని ఆ కూరను పడేయాల్సిన పని లేదు. అమ్మమ్మల నాటి సింపుల్ చిట్కాలతో ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడమే కాకుండా… కూరను మరింత రుచిగా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. పచ్చి బంగాళాదుంప ముక్కలు (Raw Potato)… గ్రేవీలో లేదా కర్రీలో పచ్చి బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి వేసి, 10-15 నిమిషాలు ఉడికించండి. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ గ్రేవీలోని నీటితో పాటు ఉప్పును కూడా పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఈ ముక్కలను తీసివేస్తే సరిపోతుంది. 2. గోధుమ పిండి ఉండలు …మనం చపాతీకి కలుపుకునే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేయండి. ఈ పిండి ఉండలు కూరలోని అదనపు ఉప్పును, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. వంట పూర్తయ్యాక వీటిని బయటకు తీయవచ్చు. 3. నిమ్మరసం లేదా వెనిగర్.. పులుపు అనేది ఉప్పు తీవ్రతను తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది ఉప్పును పూర్తిగా తీసివేయకపోయినా, నాలికపై ఉప్పు ఘాటు తెలియకుండా రుచిని కవర్ చేస్తుంది. 4. పెరుగు లేదా మీగడ.. గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు చెంచాల చిలికిన పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపడం అద్భుతమైన మార్గం. పెరుగులో ఉండే ఫ్యాట్స్, పులుపు ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా, కూరకి మంచి టెక్స్చర్ , క్రీమీ రుచిని ఇస్తాయి. 5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్నెస్ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది
గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మ, నారింజ ముక్కలు, దాల్చినచెక్క వంటివి వేసి మరిగించండి. ఇలా చేస్తే ఆ సువాసన ఇల్లు అంతా వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది. ఇంట్లోని దుర్వాసన పోగొట్టడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. దీనికోసం ఓపెన్ బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, కొద్దిగా రోజ్మేరీ ఆయిల్ కలిపి ఇంట్లో ఓ మూలన ఉంచితే సరిపోతుంది. ఇంట్లో ఓ గిన్నెలో ఎండిన లేదా తాజా గులాబీ పూల రెమ్మలు నింపండి. ఇందులో కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసి ఒక దగ్గర పెడితే సరిపోతుంది. ఇంటిని సువాసనభరితంగా మార్చడానికి కొన్ని మొక్కలు కూడా సహాయపడతాయి. దీనికోసం మల్లె, పు దీనా, లావెండర్, యూకలిప్టస్, రోజ్మేరీ లాంటి మొక్కలు సహాయపడతాయి. ఇంట్లోని దుర్వాసన పీల్చుకుని మంచి వాసన నింపడంలో కాఫీ గింజలు సహాయపడతాయి. దీనికోసం ఓపెన్ బౌల్లో కాఫీ గింజలు వేసి ఇంట్లో మూలకు పెడితే మంచిది. వైట్ వెనిగర్లో నిమ్మ లేదా నారింజ తొక్కలు రెండు వారాల పాటు నానబెట్టండి. తర్వాత వడబోసి ఈ మిశ్రమంతో ఇంటిని తుడిస్తే ఇల్లు సువాసన వస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ వాసన చాలా బాగుంటుంది. దీనిని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంటిని సువాసనభరితంగా మార్చవచ్చు. లేదంటే ఆ మొక్కను ఇంట్లో పెంచినా సరిపోతుంది. లావెండర్ ఆయిల్ ఇంటిని సువాసనభరితంగా మారుస్తుంది. దీనికోసం నీళ్లలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ఇంట్లో అవసరం ఉన్నపుడు స్ప్రే చేస్తే సరిపోతుంది. వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇంటికి సువాసన అందించడంలో సహాయపడుతుంది. దీనికోసం వెనీలా ఎక్స్ట్రాక్ట్లో కాటన్ బాల్ ముంచి షెల్ఫ్లో ఎక్కడో ఓ చోట పెడితే సరిపోతుంది

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న సంజయ్గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో గందరగోళం... ప్రవేశాలు, ఫీజులపై స్కిల్స్ వర్సిటీ పట్టు ప్రైవేటు పెత్తనంపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగం (కార్మిక శాఖ)లోకి తీసుకురావడంతోపాటు ఆయా కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో నం. 97 జారీ చేయడం గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓవైపు విద్యార్థి సంఘాలు, సాంకేతిక విద్యామండలి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు స్కిల్స్ వర్సిటీ పాలక మండలి పాలిటెక్నిక్ విద్యపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగుల వ్యతిరేకత తీవ్రతరమైతే దాన్ని దారికి తేవడం కష్టమని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాకే ఈ విషయంలో విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. అధికారాలు కోరుతున్న స్కిల్స్ వర్సిటీ... స్కిల్స్ యూనివర్సిటీ పాలకవర్గం బహుళజాతి సంస్థల ప్రతినిధుల కనుసన్నల్లో ఉంది. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యం అందించే కోర్సులు, సిలబస్ రూపకల్పనను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. పారిశ్రామిక భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సమకూరిస్తే నైపుణ్య శిక్షణ స్కిల్స్ వర్సిటీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధులనూ సమకూర్చుకోవాల్సిందే. ఈ తరహా ఆర్థిక పరమైన బాధ్యత ఉంది కాబట్టి అన్ని అధికారాలూ తమకు ఉండాలని పాలక మండలి ప్రభుత్వానికి సూచించింది. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణ, ఫీజులు, సిలబస్, బోధన ప్రణాళిక మొత్తం తమ చేతుల్లో ఉండాలని ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు 53 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడం తమ పరిధిలో ఉండాలని కోరుతోంది. అలాగే పాలిటెక్నిక్ విద్యకు అవసరమైన ఫీజుల నిర్ణయం తమకే ఉండాలని, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కూడా కోరుతోంది
రోజులో కాసేపు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. దీని వల్ల నాడీ వ్యవస్థ కూల్ అవుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల ఎండార్పిన్లు రిలీజ్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. రోజులో కాసేపు నచ్చిన వారితో సమయం గడపండి. లేదా మీకు నచ్చిన వారితో ఫోన్ మాట్లాడండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయలేని, మీకు ఇష్టం లేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. నో చెప్పకుండా పని చేస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో సమయం గడిపితే కంపేరిజన్ పెరిగి మానసిక ఆందోళన వస్తుంది. రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. పచ్చని చెట్లు, ఆకాశం, పక్షులను గమనించండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి నిద్రలేవండి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు

గుంటూరు-రాయగడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కారణాల వల్ల గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (Rayagada-Guntur Express) రైలు రాకపోకల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో రెండు స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ను మారుస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు వీటిని గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!రాయగడ నుంచి గుంటూరుకు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17244 టైమింగ్స్ లో ఈ మార్పు చోటు చేసుకుంది. రాయగడ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలును ఇకపై 2.50కే బయలుదేరేలా మార్పు చేశారు. అలాగే జిమిడిపేట స్టేషన్లో ఈ రైలు మధ్యాహ్నం 3.16కు చేరుకోవాల్సి ఉండగా.. ఇకపై దీన్ని 3.06కు అంటే 10 నిమిషాల ముందుగా వచ్చేలా మార్పు చేశారు. దీంతో జిమిడిపేట స్టేషన్లో బయలుదేరాల్సిన సమయం కూడా 3.18 నుంచి 3.08కి మారింది. ఈ మార్పులు ఆగస్టు 24 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) అధికారులు ప్రకటించారు. రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంది. ఇప్పటివరకూ రాయగడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 4.50కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయాణించే రూటులో దాదాపు 30 హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలుకు మాత్రమే ఈ టైమింగ్స్ లో మార్పు చేశారు. గుంటూరు-రాయగడ

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి జీవన విధానం ఎన్నో కొత్త అనుభవాలను పరిచయం చేస్తుంది. జింబాబ్వేకు చెందిన కలుంబా మ్వాలేకు కూడా భారత్కు వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇక్కడికి రాకముందు సాధారణంగా భావించిన కొన్ని విషయాలు.. భారత్లో అడుగుపెట్టాక తనకు పూర్తిగా భిన్నంగా అనిపించాయని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్లోని యూనివర్సిటీలు, కాలేజీల సంఖ్య తనను బాగా ఆశ్చర్యపరిచిందని మ్వాలే చెప్పారు. జింబాబ్వేలో యూనివర్సిటీలో సీటు దక్కించుకోవడం చాలా పోటీతో కూడుకున్న వ్యవహారమని, కానీ భారత్లో వందలాది విద్యాసంస్థలు, వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే తన యూనివర్సిటీలో ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. జింబాబ్వేలో ఇంత వైవిధ్యమైన అంతర్జాతీయ విద్యార్థుల సమూహాన్ని తాను చూడలేదని చెప్పారు. భారతీయ ఆహారం కూడా తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని మ్వాలే తెలిపారు. జింబాబ్వేలో సద్జా, అన్నం, స్ట్యూ వంటి ఆహారం ఎక్కువగా ఉంటే.. భారత్లో ప్రాంతానికో రకమైన వంటకం, రుచులు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా ‘స్పైస్’ అంటే కేవలం కారం అనుకున్న తనకు.. భారతీయ వంటల్లో అది ఎన్నో రుచులు, సుగంధ ద్రవ్యాల కలయిక అని అర్థమైందన్నారు. వైద్యం విషయంలోనూ తన అభిప్రాయం మారిందని, విదేశాల నుంచి చికిత్స కోసం భారత్కు వచ్చే వారిని చూసిన తర్వాత భారత వైద్య రంగంపై కొత్త అవగాహన వచ్చిందని తెలిపారు. ఇక విదేశాల్లో అవకాశాలంటే బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలే గుర్తొచ్చేవని మ్వాలే చెప్పారు. అయితే
ఎండలో బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకోండి. దీంతో ఎండ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ లేని ఉత్పత్తులు ఉపయోగించండి. దీని వల్ల ముఖంపై జిడ్డు తగ్గుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవు. మొటిమలు తగ్గుతాయి. రోజుకి రెండు సార్లు ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్తో కడగండి. దీంతో ముఖంపై జిడ్డు, మురికి తొలగుతుంది. మొటిమలు తగ్గుతాయి. మొటిమలను చేతులతో తాకవద్దు. చేతులతో తాకడం వల్ల మొటిమలు తీవ్రం అవుతాయి. చేతులతో తాకడం వల్ల అందం కూడా దెబ్బతింటుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. చర్మం హైడ్రేట్గా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. టీ ట్రీ ఆయిల్ డైల్యూట్ చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ముఖానికి చెమట పడితే వెంటనే కడగండి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల రిస్క్ తగ్గుతుంది. ఎప్పటికప్పుడు దిండు కవర్ను మార్చుకోండి. దిండు కవర్లు, టవల్స్ను మార్చడం వల్ల మొటిమలు రిస్క్ తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. షుగరీ ఫుడ్, జంక్ఫుడ్ తినడం వల్ల మొటిమలు వస్తాయి
రోజ్ వాటర్ నేచురల్ టోనర్లాగా పనిచేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఓపెన్ పోర్స్ క్లీన్ చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీనికోసం ఫేస్ వాష్ చేసుకున్నాక రోజ్ వాటర్ టోనర్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ముఖంపై జిడ్డు, మురికి తొలగించి ఓపెన్ పోర్స్ సమస్యను నివారించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. ముఖంపై దుమ్ము, ధూళి తగ్గించి ఓపెన్ పోర్స్ సమస్యకు చెక్ పెట్టడంలో తేనె, నిమ్మరసం సహాయపడతాయి. దీనికోసం నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు. ఓపెన్ పోర్స్ సమస్య తగ్గించడంలో కోడిగుడ్లు సహాయపడతాయి. దీనికోసం కోడిగుడ్డు తెల్లసొనను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చాలు. అలోవెరాలోని సమ్మేళనాలు ముఖంపై రంధ్రాలను క్లీన్ చేస్తుంది. చర్మాన్ని క్లియర్ చేసి అందంగా మారుస్తుంది. దీనికోసం అలోవెరాను చర్మానికి బాగా అప్లై చేసి గంట తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిపిస్తుంది. ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు. చర్మాన్ని కూల్ చేసి ఓపెన్ పోర్స్ కుచించుకుపోయేలా చేయడంలో ఐస్ క్యూబ్ సహాయపడుతుంది. దీనికోసం ఐస్ క్యూబ్ను శుభ్రమైన క్లాత్లో చుట్టి ముఖంపై మర్దన చేయండి. 10 నిమిషాలు ఇలా చేసి ముఖం క్లీన్ చేసుకుంటే చాలు. నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించడానికి బేకింగ్ సోడా వాడవచ్చు. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోండి. కాసేపయ్యా క్లీన్ చేసుకుంటే చాలు. చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి ముఖంపై రంధ్రాలను క్లీన్ చేయడంలో వెనిగర్ సహాయపడుతుంది. దీనికోసం

తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు మరియు యువతపై విధించిన వివాదాస్పద నిషేధ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎడమపక్ష పార్టీలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ జారీ చేసిన ఆదేశాలను ఆగస్టు 19న రద్దు చేసింది. జెన్ జీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆగస్టు 14న స్కూల్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రతిపక్షాలు మరియు విపక్ష విద్యార్థి సంఘాల నిరసనలకు యువత లొంగకుండా విద్యా శాఖలు, పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం నిరోధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 17న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రిన్సిపాల్స్కు లేఖ రాస్తూ ఆగస్టు 20లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అత్యవసరంగా పంపిన ఈ కమ్యూనికేషన్ బయటకు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా జూలై 28న జరిగిన లా అండ్ ఆర్డర్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిరోధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని విద్యార్థి లోకం భగ్గుమంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని యువత గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు తెలిపింది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగి రాజకీయంగా రచ్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న

ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో, జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో ఈ సీట్లు వేగంగా భర్తీ అవుతున్నాయి.బుధవారం హైదరాబాద్లోని యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్కు సుమారు 200 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. దీంతో క్యాంపస్ ప్రాంగణమంతా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా మారింది.కౌన్సెలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జేఎన్టీయూ హైదరాబాద్లోని 26 సీట్లు, సుల్తాన్పూర్లోని 8 సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. ఇక జగిత్యాల కళాశాలలోని రెండు సీట్లలో ఒకటి భర్తీ అయింది. సీట్లు శరవేగంగా భర్తీ అవుతున్నాయని అడ్మిషన్ల డైరెక్టర్ బాలునాయక్ వెల్లడించారు.ఈ ప్రక్రియలో భాగంగా నేడు (గురువారం) మంథని, సిరిసిల్ల, పాలేరు కళాశాలలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రేపు (శుక్రవారం) వనపర్తి, కోస్గి, మహబూబాబాద్ కళాశాలలకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ మొత్తం హైదరాబాద్ క్యాంపస్లోనే జరుగుతుందని అధికారులు తెలిపారు.సీట్ల కేటాయింపును ఈఏపీసెట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీ మరియు ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా చేపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులకు 'ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత' ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, అవసరమైన ఫీజుతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని అధికారులు సూచించారు

ఎప్సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్, సుల్తాన్పూర్, జగిత్యాల కాలేజీల్లో హాట్కేకుల్లా సీట్ల భర్తీ నేడు మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో.. రేపు వనపర్తి, కోస్గి, మహబూబాద్ కాలేజీల్లో.. హైదరాబాద్ సిటీ: ఎప్సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. బుధవారం ఉదయం వర్సిటీ అడ్మిషన్ల విభాగంలో జరిగిన కౌన్సెలింగ్కు సుమారు 200మంది అభ్యర్థులతోపాటు, వారి తల్లిదండ్రులు తోడు రావ డంతో క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్లలో 26, సుల్తాన్పూర్లో 8, జగిత్యాలలో 2 సీట్లు ఖాళీగా ఉండగా జగిత్యాలలో ఒక సీటు మినహా మిగిలిన సీట్లన్నీ హాట్ కేకేల్లా భర్తీ అయ్యాయని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. గురువారం మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో, శుక్రవారం మహబూబాబాద్, వనపర్తి, కోస్గి జేఎన్టీయూ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ను హైదరాబాద్ క్యాంపస్లోనే నిర్వహిస్తామని చెప్పారు. స్పాట్ కౌన్సెలింగ్లో అభ్యర్థుల ఎప్సెట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరి, ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత మొదట వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు అన్ని సర్టిఫిక్టెలతోపాటు ఫీజు డబ్బులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..!ఈ పువ్వు కళ్లకు హానికరం.. కానీ, ఆ రోగాలన్నింటికీ దివ్యౌషధం..! August 19 Jyothi Gadda కీళ్ల నొప్పుల నివారణ: జిల్లేడు ఆకులను వేడి చేసి బాధిస్తున్న కీళ్లపై కట్టడం లేదా ఆకుల రసాన్ని క్రమంగా రాయడం వల్ల వాపులు, తీవ్రమైన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు: జిల్లేడు పువ్వులు లేదా ఆకుల డికాక్షన్ శ్వాసనాళాల్లోని కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపడం ద్వారా ఆస్తమా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. తలనొప్పికి చక్కటి పరిష్కారం: జిల్లేడు ఆకులను మెత్తగా నూరి నుదిటిపై పేస్ట్లా రాయడం వల్ల అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ: ఆకుల పేస్ట్ లేదా రసాన్ని చర్మంపై పూయడం వల్ల తామర, దురదలు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లు పెరగకుండా అరికట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైల్స్ సమస్యకు ఉపశమనం: పైల్స్ గాయాలు, నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకుల పేస్ట్ను గాయంపై తరచూ అప్లై చేయడం వల్ల మంట తగ్గి గాయాలు త్వరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుదల: జిల్లేడు భాగాలను సంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో సరైన మోతాదులో వాడటం వల్ల మలబద్ధకం, విరేచనాలు, కడుపు పూతల వంటి సమస్యలు తగ్గుతాయి. గాయాలను త్వరగా మానపడం: ఈ మొక్కలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు శరీరంపైన ఏర్పడే దెబ్బలు, గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో బాగా తోడ్పడతాయి. దంత సమస్యల నివారణ: జిల్లేడు వేరు లేదా పాలు ఆయుర్వేదంలో దంత క్షయం, పంటి నొప్పి, చిగుళ్ల వాపుల నివారణలో ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఎంతగానో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ: జిల్లేడు ఆకుల్లోని ప్రత్యేక గుణాలు శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరిచి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మరిన్ని

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. ఆ క్రమంలో ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనపై కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్లోని ఆర్థిక అంశాల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దుగరాజుపట్నం పోర్టు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఆయన కోరనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంశాన్ని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సహకారానికిగాను కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిగిలిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిధులు సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి: సీఎం చంద్రబాబు అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు 'ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026'ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్' విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా 'విష్ణు మహిళా విశ్వవిద్యాలయం' ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు