బ్రిక్స్ సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫాసో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. మరోవైపు బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన చైనా అధ్యక్షుడు న్యూఢిల్లీలో స్ట్రోక్కు గురయ్యారని.. దీంతో ఆయన ప్రత్యేక విమానంలో చైనా వెళ్లి చికిత్స పొందుతున్నారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. ఇదే అదనుగా బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారని తప్పుడు ప్రచారం మొదలైంది.





