
బీఆర్ఎస్ దోచుకున్న భూముల్లో కాషాయ జెండాలు ఎగురవేసి, పేదలకు పంచుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 60ు మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి గజం జాగా లేదని.. బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాలను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండయాత్ర చేస్తామన్నారు





