
ఎన్టీఆర్ జిల్లాలోని తిరుపూర్ రోడ్డులో ఓ పాదరక్షల దుకాణంలో ఘరానా మోసం చోటుచేసుకుంది. దుకాణంలో చెప్పులు కొన్నట్టు నటించి.. ఓనరు ఫోన్ అడిగాడు. అర్జెంటుగా ఒకరికి ఫోన్ చేసుకోవాలని చెప్పాడు. దీంతో ఫోన్ ఇచ్చి.. లోపలి నుంచి చెప్పులు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అతడ్ని మాటల్లో పెట్టిన యువకుడు.. అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ వెంటనే అతడికి మరో షాక్ తగిలింది. యూపీఐ నుంచి రూ. లక్షలు మరో ఖాతాకు బదిలీ చేశాడు.




