
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ మేరకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. సాధారణంగా స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి సముదాయాల్లో మరుసటి రోజు స్లాట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తారు.




