
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. భైరవం సినిమాతో హీరోగా ఆకట్టుకున్న మనోజ్ మిరాయ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ విలన్ గా సైమా అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుత ఈ హీరో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తోన్న ఆస్మాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు మనోజ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ మంచు వారబ్బాయి దివంగత నటుడు శ్రీహరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘మేఘాంశ్ నా తమ్ముడు. ఆస్మాన్ మూవీ టీజర్ లాంచ్ కి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను టీజర్ చూశాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మనం బాగా ప్రేమించే వాళ్లకు ఎప్పుడు సక్సెస్ రావాలని, లైఫ్ లో వాళ్లు నిలబడాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. అలా నేను బలంగా కోరుకునే వాళ్లలో నా తమ్ముడు మేఘాంశ్ ఒకరు. ఎందుకంటే శ్రీహరి అంకుల్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు. ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. తమ్ముడు మేఘాంశ్ ని నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను. మా నాన్నగారు, మేఘాంశ్ వాళ్ల నాన్నగారు.. ఇద్దరూ సొంత అన్నదమ్ముళ్లులాగా ఉండేవారు. ఎప్పుడు ఆయన గురించి చెప్తున్నా నా మనసు కదులుతుంది. కానీ ఇప్పుడు మన మధ్య ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ‘సినిమా’ ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారి పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. అది మాత్రం నిజం. ఆయన ప్రతిరూపమైన మేఘాంశ్ శ్రీహరి ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ టీజర్ తో ఇలా మన ముందుకి వచ్చి, ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వబోతున్నాడని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.





