
పరాయి రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారందరికీ భాషాభిమానం ఉండాలిగానీ, ఇతర భాషలపై దురభిమానం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.




