
ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేయనుంది. ఇంటి స్థలం లేని పేదలకు వీటిని అందించేందుకు సమాయత్తం అవుతోంది. గ్రామాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం అందించనుండగా.. పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం పంపిణీ చేయనుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ స్థలాల సేకరణకు కసరత్తు చేస్తోంది. దాదాపు 1,24,873 మంది కొత్తగా ఇంటి స్థలాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం భూమిని సేకరించనుంది. ఇందుకోసం 4800 ఎకరాల అవసరం అవుతాయని అధికారులు గుర్తించగా.. సేకరించిన అనంతరం రైతులకు ఇళ్ల పట్టాలు అందించనుంది. అక్టోబర్ లేదా నవంబర్లో ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.





