
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
India Pakistan water dispute: చేతిలో గిన్నె పట్టుకుని ప్రపంచం చుట్టూ తిరుగుతున్న పాకిస్తాన్.. గత ఏడాదికి చుక్క నీటి బొట్టు కోసం తహతహలాడుతోంది. దీనికి కారణం పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న కఠిన వైఖరి అని చెప్పాలి. ఏప్రిల్ 22, 2025న జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం.. భారత్ తీసుకున్న ఈ కఠినమైన చర్య పాకిస్తాన్ ను కలవరపెట్టింది. దీంతో అప్పటి నుంచి భారత్ పై అక్కసు వెళ్లగగ్గుతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ పై నోరు పారేసుకుంది పాకిస్తాన్.
పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ కు కేటాయించిన నీటి వాటాను ఎవరైనా తాకితే వారి చేతులు నరికేస్తామంటూ ఇప్పటికే స్పష్టం చేశామని మాలిక్ పేర్కొన్నారు. పాకిస్తాన్ వార్తా ఛానెల్ ఏఆర్ఐలో ఆయన చేసిన ఈ ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముసాదిక్ మాలిక్తో పాటు.. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అటౌల్లా తారర్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించకుండా ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తానీ వార్తాపత్రిక డాన్ ప్రకారం తాతార్ మాట్లాడుతూ.. పొరుగు దేశ ప్రధాని చేతిలో నీటి కుళాయి ఉంది. పాకిస్తాన్లోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనివ్వనని ఆయన అంటున్నారు. ఈ ఒప్పందాన్ని ఏ దేశమూ స్వయంగా రద్దు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే దేనిపైనా అదుపు లేనివారు గొప్పలు చెప్పుకుంటారని అంటుంటారు. పాకిస్తాన్కు కూడా ఎప్పటినుంచో ఈ అలవాటు ఉంది. షాబాజ్ మంత్రుల వార్నింగ్ లు ఎలా ఉన్నప్పటికీ.. వాస్తవం ఏమిటంటే భారత్.. కఠిన వైఖరి కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు నీటి కోసం తీవ్రంగా అల్లాడుతోంది. దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలి. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసి ఉండలేవని.. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకునేందుకు ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ ల మధ్య 1960లో ఒప్పందం కుదిరింది. అయితే పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్ పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రులు దీనిపై స్పందిస్తూ.. భారత్ పై ఆరోపణలు చేశారు.
అంతేకాదు.. ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గబోదని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా.. కన్నీళ్లు ఇంకిపోయిన వారు మా నుండి నీటిని ఆశించకూడదని మేము స్పష్టం చేశాము. ఉగ్రవాదుల అధిపతులకు, మానవాళి శత్రువులకు సింధు నది నీరు చేరడానికి మేము అనుమతించము రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.