
వర్షాకాలం అంటే కేవలం బురద, ట్రాఫిక్ జామ్లు మాత్రమే కాదు. వర్షాకాలం అనేది ప్రకృతి తనను తాను రీసెట్ చేసుకునే సమయం. ఆ రీసెట్ బటనే జలపాతాలు. భారతదేశం అంతటా ఎన్నో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి.
కానీ కొన్ని జలపాతాలు మాత్రం వర్షాకాలంలోనే వాటి అసలైన రూపాన్ని చూపిస్తాయి.
వర్షాకాలంలో జలపాతాలను చూడటంలో ఉండే కిక్కే వేరు. వర్షాలు పడగానే కొండలు, అడవులు పచ్చటి తివాచీ పరిచినట్లు అవుతాయి. ఎండిపోయిన పాయలు కూడా ఒక్కసారిగా జీవం పోసుకుంటాయి. ఉవ్వెత్తున ఎగసిపడే నీళ్లు, చల్లటి గాలి, మట్టి వాసన.. సిటీ లైఫ్ లో ఉండే అలసటను ఒక్క నిమిషంలో మాయం చేస్తాయి. ఇండియాలో వర్షాకాలంలో మిస్ అవ్వకూడని ఆ 6 బెస్ట్ జలపాతాల లిస్ట్ గమనిస్తే..
ఎక్కడ ఉంది: కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.
స్పెషాలిటీ: చాలకుడి నది నీరు దాదాపు 80 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా కిందకు పడుతుంది. చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. మన అందరికీ నచ్చిన సూపర్ హిట్ సినిమా "బాహుబలి" షూటింగ్ ఇక్కడే జరిగింది.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ జలపాతం అసలైన అందాలను చూడవచ్చు. నీటి వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, దాని ముందు నిలబడటం కూడా కష్టమే. నీటి తుంపర్లు వచ్చి మిమ్మల్ని తడిపేస్తాయి.
ఎలా వెళ్ళాలి: కొచ్చి ఎయిర్పోర్ట్ నుండి ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్ రెంట్ కు తీసుకుని ఈజీగా వెళ్ళవచ్చు. దీనికి దగ్గరలోనే ఉండే వజాచల్ జలపాతాన్ని కూడా మీరు చూసేయొచ్చు.
ఎక్కడ ఉంది: గోవా-కర్ణాటక బోర్డర్లో, భగవాన్ మహావీర్ శాంచ్యురీ లోపల ఉంది.
స్పెషాలిటీ: 310 మీటర్ల ఎత్తు నుండి నాలుగు ధారలుగా నీరు కిందకు పడుతుంది. కొండపై నుండి పాల నది ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: వర్షాకాలంలో మాండవి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ సమయంలో దూద్ సాగర్ రూపం భయంకరంగా, అంతే అందంగా ఉంటుంది. రైలులో వెళ్లేటప్పుడు ఈ జలపాతం మీదుగానే రైలు వెళ్తుంది, ఆ ఎక్స్ పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఎలా వెళ్ళాలి: పనాజీ నుండి జీప్ సఫారీ బుక్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళవచ్చు. కానీ వర్షాకాలంలో ట్రెక్కింగ్ రిస్క్ కాబట్టి, గైడ్ను తీసుకెళ్లడం మంచిది.
స్పెషాలిటీ: ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్లంచ్ వాటర్ ఫాల్. 340 మీటర్ల ఎత్తు నుండి నిరంతరాయంగా నీరు కిందికి పడుతూ అక్కడ ఒక బ్లూయిష్ గ్రీన్ కలర్ గుండాన్ని ఏర్పాటు చేస్తుంది.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: చిరపుంజీ అంటే ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతం. వర్షాకాలంలో ఇక్కడ మేఘాలు, పొగమంచు, నీరు అన్నీ ఒకటే అయిపోతాయి. ఒక్కోసారి జలపాతం కనిపించదు, కేవలం దాని గర్జన మాత్రమే వినిపిస్తుంది. అదో రకమైన ఫీలింగ్ ఇస్తుంది.
ఎలా వెళ్ళాలి: షిల్లాంగ్ నుండి ఇది 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయాన్నే బయలుదేరితే ఒక రోజులోనే చూసి వచ్చేయొచ్చు. వ్యూ పాయింట్ నుండి చూడటమే బెస్ట్ ఆప్షన్.
ఎక్కడ ఉంది: కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది.
స్పెషాలిటీ: శరావతి నది నీరు 830 అడుగుల ఎత్తు నుండి రాజా, రాణి, రోరర్, రాకెట్ అనే నాలుగు ధారలుగా విడిపోయి కిందకు దూకుతుంది.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: వర్షాకాలం కాకుండా మిగతా రోజుల్లో జోగ్ జలపాతాన్ని చూడటం వేస్ట్. అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి నీరు తగ్గిపోయి జలపాతం ఎండిపోతుంది. వర్షాకాలంలో మాత్రం ప్రతి ధారా పూర్తి వేగంతో ప్రవహిస్తుంది.
ఎలా వెళ్ళాలి: బెంగళూరు నుండి ఇది సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిమోగా మీదుగా వెళ్ళాలి. వ్యూ పాయింట్కి వెళ్లే దారి కొంచెం బాలేకపోయినా, అక్కడ కనిపించే వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది.
ఎక్కడ ఉంది: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, భీమశంకర్ వైల్డ్లైఫ్ శాంచ్యురీ లోపల ఉంది.
స్పెషాలిటీ: సహ్యాద్రి పర్వతాల గుండా ప్రవహించే ఈ జలపాతం దట్టమైన అడవులతో కప్పబడి ఉంటుంది. ప్రసిద్ధ భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయం కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ప్రకృతి, భక్తి రెండూ కలిసి కనిపిస్తాయి.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: జూలై, ఆగస్టు నెలల్లో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎటు చూసినా పచ్చదనమే. జలపాతం నీరు గుడి పక్కనుంచే ప్రవహిస్తుంది. ప్రశాంతతను కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.
ఎలా వెళ్ళాలి: పుణె నుండి ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్ లేదా బైక్ పై వెళ్ళవచ్చు. టెంపుల్ విజిట్, వాటర్ ఫాల్ రెండూ ఒకే ట్రిప్లో కవర్ చేయవచ్చు.
ఎక్కడ ఉంది: ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో, ఇంద్రావతి నదిపై ఉంది.
స్పెషాలిటీ: ఇది 100 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గుర్రపు నాడా ఆకారంలో వంగి నీరు కిందకు పడుతుంది. వర్షాకాలంలో నది మొత్తం జలపాతంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో చంద్రుని వెలుతురులో ఇక్కడ మూన్ రెయిన్బో అంటే చంద్ర ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది.
వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: వర్షాకాలంలో ఇంద్రావతి నదిలో నీరు ఎంతలా పెరుగుతుందంటే, జలపాతం గర్జన 5 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. బోట్ తీసుకుని జలపాతం దగ్గరకు వెళ్లవచ్చు. నీటి తుంపర్లతో శరీరం మొత్తం తడిసి ముద్దవుతుంది.
ఎలా వెళ్ళాలి: జగదల్పూర్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయ్పూర్ లేదా విశాఖపట్నం నుండి ట్రైన్ ద్వారా జగదల్పూర్ చేరుకోవచ్చు.