
ఐర్లాండ్ చేతిలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఎదుర్కొన్న పరాభవంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద పారుతోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ తనదైన శైలిలో సెటైర్లు వేసే 'ఐస్లాండ్ క్రికెట్' ఈసారి ఏకంగా టీమిండియా హెడ్...
ఐర్లాండ్ చేతిలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఎదుర్కొన్న పరాభవంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద పారుతోంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ తనదైన శైలిలో సెటైర్లు వేసే 'ఐస్లాండ్ క్రికెట్' ఈసారి ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేస్తూ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-2తో భారత్ కోల్పోవడంతో మూడేళ్ల అజేయ రికార్డుకు బ్రేక్ పడింది. ఈ గాయంపై ఐస్లాండ్ క్రికెట్ ఇప్పుడు కారం చల్లేలా సెటైర్లు వేసింది.ఐస్లాండ్ క్రికెట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. "మేము గౌతమ్ గంభీర్ను మా కోచింగ్ స్టాఫ్లో చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదని స్పష్టం చేస్తున్నాం. అయితే ఆయనలో కచ్చితంగా అద్భుతమైన టాలెంట్ ఉంది. అంతటి స్టార్ భారత ఆటగాళ్లను పెట్టుకుని, ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలు ఇవ్వడం నిజంగా ఒక అసాధారణమైన బహుమతి (టాలెంట్)" అంటూ విపరీతమైన వ్యంగ్యంతో పోస్ట్ పెట్టింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి వరల్డ్ కప్ విన్నర్లతో కూడిన స్టార్-స్టడెడ్ టీమిండియా.. ఐర్లాండ్ బౌలింగ్ ధాటికి కుప్పకూలడాన్ని ఉద్దేశించి ఈ క్లాసిక్ జబ్ విసిరింది.గౌతమ్ గంభీర్ 2024లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారత్ వరుసగా 16 టీ20 సిరీస్లలో అజేయంగా నిలిచింది. గంభీర్ ఆధ్వర్యంలో శ్రీలంక (3-0), బంగ్లాదేశ్ (3-0)లను వైట్వాష్ చేయడమే కాకుండా, సౌతాఫ్రికా (3-1), ఇంగ్లండ్ (4-1), ఆస్ట్రేలియా (2-1), న్యూజిలాండ్ (4-1)లపై సిరీస్ విజయాలు సాధించింది. దాదాపు మూడేళ్ల