
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
India Cruise Capital:దక్షిణ భారతదేశంలో ముంబై ప్రాంతం క్రూయిజ్ కేంద్రంగా మారుతోంది. అరేబియా మహాసముద్ర తీరాన ఉన్న ముంబైతోపాటు, బంగాళాఖాతం తీరాన ఉన్న కొచ్చి, చెన్నై, విశాఖ పట్నం ప్రాంతాలు క్రూయిజ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రోజురోజుకీ ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది. ప్రయాణికులు జలమార్గంద్వారా ముంబయి, గోవా,కొచ్చి, చెన్నై, పుదుచ్చేరి, విశాఖపట్నం పరిసరాలను సందర్శించే విధంగా విహారయాత్ర ప్యాకేజీలు ఆకర్షణీయంగా ఉండటంతో క్రూయిజ్ ల ద్వారా ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరిగింది. విలాసవంతమైన నౌకలు, అంతర్జాతీయ క్రూయిజ్ల ప్రయాణానికి దక్షిణ భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది.
క్రూయిజ్ విహార యాత్ర.. మోటార్ వెసల్ తో గంగా విలాస్ క్రూయిజ్ ద్వారా నదీ విహార యాత్ర అందుబాటులోకి వచ్చింది. దీంతో భారతదేశం, బంగ్లాదేశ్ లోని బంగ్లాదేశ్లోని 27 నదీ వ్యవస్థల గుండా 3,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతారా లగ్జరీ రివర్ క్రూయిజెస్ నిర్వహించే ఈనౌక, వారణాసి నుండి దిబ్రుగఢ్ వరకు 51 రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఇందులో 36 మంది అతిథుల కోసం 18 విలాసవంతమైన సూట్లు, ఫైన్ డైనింగ్, ఒక స్పా, ఆధునికీకరించిన బట్లర్ సేవ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ముంబై నుండి క్రూయిజ్ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.. రోడ్డు రవాణా, విమానాయాన సౌకర్యం, జలమార్గాల ద్వారా వస్తురవాణాకు అనువుగా పోర్టులను ఆధునికీకరించారు. దీంతో నౌకల ద్వారా విహారయాత్రలు, వస్తూత్పత్తులు ఎగుమతులు జోరందుకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.