
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. 4 నెలల్లోనే దాదాపు 49వేల రూపాయల వరకు పసిడి పతనం అయ్యింది. జూన్ లో మల్లీ కమోడిటీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరరూ. 17,000, వెండి ధర రూ. 51,000 మేర పడిపోయింది. రికార్డు స్థాయి ధరలతో పోలిస్తే ఈ విలువైన లోహాలు దారుణంగా పడిపోయాయని చెప్పవచ్చు.
10 గ్రాముల బంగారం ధర ఏడాది జనవరిలో 1.93లక్షల నుంచి రూ. 1.44 లక్షలకు చేరింది. అంటే దాదాపు రూ. 49, 000వేల వరకు తగ్గింది. కిలో వెండి ధర రూ. 4.20లక్షల నుంచి రూ. 2.22 లక్షలు అంటే రూ. 1.98లక్షల వరకు తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాలని చెప్పాలి. బంగారం ఔన్సుకు రూ. 4,000 డాలర్లకు దిగువకు పడిపోయింది. వెండి ఔన్సుకు సుమారు 57డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం గరిష్ట స్థాయి రికార్డు నుంచి 30శాతం పడిపోతే.. వెండి 50శాతం మేర పడిపోయింది. ఈ అస్థిరత నేపథ్యంలో బంగారం, వెండి ధరలను మరింత తగ్గించే అవకాశం ఉన్న ఒక కీలక నిర్ణయాన్ని చైనా తీసుకుంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంచే అవకాశం ఉందన్న కారణంగా ఈ విలువైన లోహాలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో వాటి ధరలు రోజు రోజుకూ భారీగా పడిపోతున్న తరుణంలో చైనా నుంచి ఈ నిర్ణయం వెలువడింది.
ఆభరణాలు లేదా ఫిజికల్ గోల్డ్ కొనుగోలుదారులకు బంగారం ఒక మంచి ఆప్షన్ అయినప్పటికీ జూన్ కు ముందు బంగారం, వెండి కొనుగోలు చేసి ట్రేడింగ్ లేదా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారికి ఇదొక బ్యాడ్ న్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇంతకీ చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఏంటో చూద్దాం:
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి చైనాలోని అతిపెద్ద బ్యాంకులు జులై 24,2026 నుంచి రిటైల్ ఇన్వెస్టర్ల కోసం షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ కు అనుసంధానం చేసిన బంగారం, ఇతర విలువైన లోహాల ట్రేడింగ్ అకౌంట్స్ ను మూసివేస్తామని ప్రకటించాయి. ఈ నిషేధం బ్యాంకులు ఎస్జీఈ ద్వారా చిల్లర పెట్టుబడిదారులకు అందించే ప్రమాదకర వాణిజ్య సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బంగారం పెట్టుబడులను భౌతిక బంగారం, ఆభరణాలు లేదా ఇతర మార్గాల ద్వారా చేసుకోవచ్చు. ఈ హెచ్చుతగ్గుల మధ్య చిల్ల వ్యాపారులు నష్టపోకూడదన్న ఉద్దేశ్యంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణ ప్రజలు బంగారంపై ఊహాజనిత పెట్టుబడులు పెట్టకుండా చైనా వారిని అడ్డుకోవాలనుకుంటుంది. లక్షలాది మంది చిల్లర పెట్టుబడిదారులు ఒకేసారి నష్టాలపాలవుతే.. అది బ్యాంకింగ్ వ్యవస్థిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు చైనా ట్రేడింగ్ అకౌంట్స్ ను క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో బంగారం పరిణామాలు తగ్గించి..ధరలు మరింత పతనం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం భారత్ పై కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కారణంగా భారత్ కమోడిటీ, బులియన్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.