మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 12 శాఖలను తన వద్దే అట్టిపెట్టుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భూ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఇన్ని శాఖలు బాధ్యతలను స్వయంగా నిర్వహించడం భవిష్యత్తులో ముఖ్యమంత్రికి చిక్కులు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.శనివారం ఉజ్జయినిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్, "మోహన్ యాదవ్ గారూ, 12 శాఖలను మీ వద్దే ఉంచుకోవడం పెద్ద పొరపాటు. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారు" అని వ్యాఖ్యానించారు. ఆయా శాఖల్లో అధికారుల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, అంతిమంగా ముఖ్యమంత్రే జవాబుదారీ కావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఏ శాఖనూ తన వద్ద ఉంచుకోలేదని, అందుకే తనపై ఎలాంటి ఆరోపణలు నిలవలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఇటీవల ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులపై భూ కొనుగోలు ఆరోపణలు రావడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలు సుమారు 168 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని, దీని విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.అయితే, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. 2023 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వ్యక్తిగత వ్యవసాయ భూముల్లో ఎలాంటి మార్పు