
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించింది. అప్పటికే పెళ్లి కుదిరాక...
ఆ పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పడం కంటే.. కేతన్ను హత్య చేయడమే సులభంగా అనిపించిందని ఆమె తెలిపింది. పెళ్లి వద్దంటే కుటుంబ సభ్యులు బాధపడతారని, కేతన్ ను చంపేస్తే పెళ్లి ఆగిపోతుందని సియా భావించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.తన ప్రేమికుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. నవంబర్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేస్తే కుటుంబ సభ్యులు బాధపడతారని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నానని సియా చెప్పినట్లు తెలుస్తోంది.ఈ కేసు దర్యాప్తు కోసం పుణే, లోనావాలా పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సియా తల్లిదండ్రులను లోనావాలా సిటీ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఆమె సోదరుడు సాహిల్ గోయల్ను కూడా రెండోసారి ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే సాహిల్ను దాదాపు 10 గంటల పాటు విచారించిన పోలీసులు.. సియా, చేతన్ పరిచయం గతేడాది దీపావళి వేడుకల్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిందని గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.జనవరి నుంచి ఇప్పటివరకు ఇద్దరి మధ్య 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు, మొత్తం 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే చేతన్తో తమ కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని