
నాలుగు దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ఎయిరిండియా కనిష్క విమాన పేలుడు ఘటనపై కెనడా గూఢచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది.
1985 జూన్ 23న జరిగిన కనిష్క ఫ్లైట్-182 బాంబు పేలుడు వెనుక కెనడాలో కార్యకలాపాలు సాగించిన ఖలిస్థానీ తీవ్రవాదులే ఉన్నారని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) అధికారికంగా పేర్కొంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ తర్వాత ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీఎస్ఐఎస్ నివేదికలో ఖలిస్థానీ తీవ్రవాదుల పాత్రను ఇంత స్పష్టంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కెనడా భద్రతా సంస్థ ఈ స్థాయిలో బాధ్యతను ఖలిస్థానీ వర్గాలపై మోపలేదు. భారత్తో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా కెనడా ప్రభుత్వం ఇటీవల కీలక చర్యలు చేపడుతోంది. ఖలిస్థానీల కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురావడంతో పాటు, విద్వేష ప్రచారంపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.ఇటీవల కెనడా పార్లమెంట్ ఆమోదించిన ‘కంబాటింగ్ హేట్ యాక్ట్’ (బిల్ C-9) కూడా ఖలిస్థానీ వర్గాలకు ఎదురుదెబ్బగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే దేవాలయాల వద్ద నిరసనలు, విద్వేష ప్రచారం, బెదిరింపుల వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక నినాదాలు, తీవ్రవాదుల చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది.భారత్-కెనడా మధ్య భద్రతా సహకారం పెరగడం వల్ల