రాజ్యసభ ఎంపీల్లో అత్యధిక ఆస్తులుు, అత్యధిక అప్పులున్నవారు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్) తాజాగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల...
రాజ్యసభ ఎంపీల్లో అత్యధిక ఆస్తులుు, అత్యధిక అప్పులున్నవారు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్) తాజాగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. రాజ్యసభ ఎంపీల్లో ఆస్తుల విలువలో ఏపీ, తెలంగాణకు చెందిన 18మందికి 33.39శాతం ఉంది. రాజ్యసభలోని మొత్తం 233మంది ఎంపీలు ఉన్నారు.. వారిలో ముగ్గురి అఫిడవిట్లు లేవు, పశ్చిమబెంగాల్లో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. 233లో 7 తీసేస్తే 226మంది డేటా మాత్రం ఉంది. మొత్తం 226మంది ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు కాగా.. ఏపీకి చెందిన 11మంది ఎంపీల ఆస్తుల విలువ ఏకంగా రూ.1,949 కోట్లు ఉంది. తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల ఆస్తి ఏకంగా రూ.8,310 కోట్లుగా ఉంది. రాజ్యసభలో అత్యధికంగా అప్పులున్న దేశంలోనే తొలి ముగ్గురు ఎంపీల్లో జార్ఖండ్కు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ గా పరిమళ్నత్వానీకి రూ.755 కోట్ల ఆస్తులు, రూ.256 కోట్ల అప్పులున్నాయి. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.672 కోట్లు ఉంటే.. ఆయన అప్పుల విలువ రూ.200 కోట్లుగా ఉంది. మూడో స్థానంలో ఎంపీ జయాబచ్చన్కు రూ.1,578 కోట్ల ఆస్తులు, రూ.149 కోట్ల అప్పులున్నాయి. రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న తొలి ముగ్గురు ఎంపీల్లో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. తొలి స్థానంలో బీఆర్ఎస్ బండి పార్థసారథికి రూ.5,300 కోట్ల ఉంటే.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ రూ.2,558 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. పంజాబ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తాకు రూ.5,053 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. రాజ్యసభ ఎంపీల్లో 105మందిపై క్రిమిషనల్ కేసులు ఉన్నాయి. కేసులున్న ఎంపీల్లో తెలంగాణ తొలిస్థానం, మహారాష్ట్ర రెండు, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానాల్లో ఉన్నాయి. క్రిమినల్ కేసులున్నవారిలో ఏపీ నుంచి ముగ్గురు, వైఎస్సార్సీపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ నుంచి ఒకరు ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉన్నారు. రాజ్యసభలో రూ.వంద కోట్లకు పైగా ఆస్తి ఉన్న ఎంపీలు 31 మంది.. వీరిలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ ఇద్దరేసి, జనసేన నుంచి ఒకరు ఉన్నారు. రాజ్యసభ ఎంపీల్లో తెలంగాణలో 57%, ఆంధ్రప్రదేశ్లో 45% మంది ఎంపీలు బిలియనీర్లు ఉన్నారు. తెలంగాణలో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీల ఆస్తి విలువ రూ.5,524కోట్లు. అలాగే టీడీపీ నుంచి నలుగురు ఎంపీల ఆస్తుల విలువ రూ1,007 కోట్లు.. వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎంపీలకు రూ.683 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రాజ్యసభ ఎంపీల్లో పీజీ చేసిన వారు 68 మంది, డిగ్రీ 53 మంది, డాక్టరేట్లు 33 మంది, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్ 28 మంది, ఇంటర్ వరకు చదివినవారు 22 మంది ఉన్నారు. ఐదో తరగతి లోపు చదివిన వారు ముగ్గురు.. కేవలం చదవడం, రాయడం తెలిసినవారు ఒకరున్నారు. మొత్తం మీద రాజ్యసభ ఎంపీలకు సంబంధించి ఏడీఆర్ రిపోర్ట్ ఆసక్తికరంగా మారింది.