
వెనిజువెలా కరీబియన్ తీరప్రాంతంలో బుధవారం (జూన్ 24) సాయంత్రం సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు ఆ దేశాన్ని వణికించాయి. రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి.
భారీ ఆస్తి నష్టం సంభవించడంతో పాటు కరీబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ భయంతో వణికిపోయాయి.యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. మొదట కారకాస్కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలోని మొరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, సరిగ్గా దాని తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది. భూ అంతర్భాగంలో కేవలం 10 నుండి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడం వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శతాబ్ద కాలంలో వెనిజువెలా ఎదుర్కొన్న అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటి.కారకాస్లో భీతావహ వాతావరణంభూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి వీధుల్లోకి పరుగులు తీశారు. అనేక భవనాల గోడలు కూలిపోయి లోపల ఉన్న ఫర్నిచర్ రోడ్డుపైకి కనిపించేలా దెబ్బతిన్నాయి. కారకాస్లోని ప్రముఖ అల్టామిరా పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంత నగరమైన లా గుఐరాలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, గృహాలు కుప్పకూలాయి. ప్రమాద స్థలాల నుండి భారీగా ధూళి మేఘాలు గాల్లోకి లేచాయి. విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ.. "అల్టామిరా ప్రాంతంలో భవనాలు, ఇళ్లు కూలిపోయిన అత్యంత