
సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్షతోనే తాను అత్యంత సవాలుతో కూడుకున్న విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థలో సంస్కరణల దశ పూర్తయిందని, ఇకపై ఉపాధ్యాయులు పూర్తిగా బోధన, ఫలితాలపైనే దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు ఒక బృందంగా పనిచేసి దేశంలోనే ఆదర్శవంతమైన 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్'ను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో 'పి4' పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలను మంత్రి లోకేశ్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత రెండేళ్లలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు (హార్డ్వేర్) గణనీయంగా మెరుగుపర్చామని, ఇప్పుడు అభ్యసన ఫలితాలు (సాఫ్ట్వేర్) మెరుగుపర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. "కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మినహా అన్ని సౌకర్యాలు కల్పించాం. ఇక మీరు ఫలితాలపై దృష్టి పెట్టాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందించి వారి సామర్థ్యాన్ని పెంచాలి. నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి" అని లోకేశ్ సూచించారు.ఉపాధ్యాయులతో ప్రత్యక్ష సంప్రదింపులకు 'లీప్ యాప్'విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఎంఈఓ, డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, నేరుగా 'లీప్ యాప్' ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని లోకేశ్ భరోసా ఇచ్చారు. వచ్చే నెల 16, 17, 18