
ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ద్వారా ఓ వ్యక్తి రూ.1.
22 కోట్లు నష్టపోయారని పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితుల్లో ఐదుగురు మహారాష్ట్రకు చెందినవారు కాగా, ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఉన్నారు. ఈ అరెస్టులతో సైబర్ మోసాలకు సహకరించే ఆర్థిక నెట్వర్క్ను ఛేదించడంలో కీలక ముందడుగు పడిందని పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే, హైదరాబాద్కు చెందిన బాధితుడిని ఈ ఏడాది జనవరిలో '282 బార్క్లేస్ ఇండియా హై-క్వాలిటీ స్టాక్ ట్రేడింగ్ రీసెర్చ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అధిక రాబడులు, ఐపీఓ కేటాయింపుల పేరుతో ఆశ చూపి BarclaysDailyTrading.com, app.bulishmark.com వంటి నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడులు పెట్టించారు. నమ్మకం కలిగించేందుకు తొలుత రూ.1,05,000 విత్డ్రా చేసుకునేందుకు అనుమతించారు. అది నమ్మిన బాధితుడు 19 లావాదేవీల్లో మొత్తం రూ.1,22,18,029 పెట్టుబడిగా పెట్టారు.అనంతరం, బాధితుడి ఖాతాలో రూ.15.69 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీగా చూపించి, ఐపీఓల విడుదల కోసం మరో రూ.35 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ను ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడ్డారు. కంపెనీలను స్థాపించి, అధిక విలువ గల కరెంట్ ఖాతాలు తెరిచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను మూడో పక్షానికి అందించి కమీషన్ పొందేవారు. విచారణలో ఒక యెస్ బ్యాంక్ ఖాతాకు దేశవ్యాప్తంగా 26 కేసులు, సెంట్రల్