
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Devina Gehlot Success Story: హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎంతో మేలని చాలామంది విజేతలు చెబుతూ ఉంటారు. కొంతమంది ఆ సక్సెస్ సీక్రెట్ తెలియక పుస్తకాల్లో గంటల తరబడి మునిగిపోతుంటారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకొని చదువుకున్నట్లయితే జాతీయస్థాయిలో నెంబర్వన్ గా సైతం నిలవచ్చని దేవీనా గెహ్లాట్ నిరూపించారు.
ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) 2026 ఫలితాలలో దేవీనా గెహ్లాట్ అత్యధిక NTA స్కోర్తో ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పరీక్ష బాగా రాశాను అనే నమ్మకం ఉన్నప్పటికీ దేశంలోనే మొదటి స్థానం వస్తుందని అసలు ఊహించలేకపోయాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు తాను కేవలం గంటల తరబడి కూర్చొని చదవడం మాత్రమే కాదని ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకొని అందులో రెగ్యులర్గా చదువుకుంటూ సబ్జెక్టు మీద పట్టు సాధించడం వల్లనే తనకు ఇది సాధ్యమైందని ఆమె పేర్కొంది.
చదువుకునే సమయంలో మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ఆ తర్వాత మళ్లీ చదువు పైన దృష్టి సారించడం వల్లనే తాను అలసిపోకుండా ఎప్పటికప్పుడు బ్రెయిన్ ను రిఫ్రెష్ చేసుకుంటూ చదవడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాయగలిగానని ఈ సందర్భంగా తన సక్సెస్ సీక్రెట్ ను షేర్ చేసుకున్నారు. ప్రారంభంలో ప్రిపరేషన్ అనేది చాలా కష్టంగా అనిపించిందని కానీ క్రమశిక్షణతో క్రమం తప్పకుండా ఒక ప్లానింగ్ ప్రకారం స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్లడం వల్లనే తనకు ఈ ఘనత సాధ్యమైందని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది.
చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు గంటల తరబడి కూర్చొని నిద్రాహారాలు మాని చదువుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది సరిగా పరీక్ష రాసే సమయానికి డిహైడ్రేషన్ లేదా గ్యాస్ ఇబ్బందులు వచ్చి అనారోగ్యం పాలవుతుంటారు. బదులుగా చక్కగా సమయపాలన పాటిస్తూ చదవాల్సిన సబ్జెక్టులను అన్నింటిని ఒక క్రమ పద్ధతిలో చదువుతూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా పరీక్షల్లో విజయం సాధించవచ్చు అని దేవీనా గెహ్లాట్ నిరూపించారు. తాను సాధించిన ఈ విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహకారం వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఐఐటి జేఈఈ ఫలితాల్లో సైతం తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. ఇక నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా మరోసారి రీనీట్ నిర్వహించారు. దీని ఫలితాలు మళ్లీ రావాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ పరీక్ష పూర్తయింది. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవకుండా దేవినా గెహ్లాట్ తరహాలోనే ఒక మంచి ప్లానింగ్ ప్రకారం చదువుకున్నట్లయితే అనుకున్న లక్ష్యాన్ని చేదించవచ్చని మానసిక వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.