
హైదరాబాద్ ఐటీ రంగానికి అమెరికా డెవల్పమెంట్ సెంటర్లను ఇస్తే, ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను తాము అందిస్తాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని యూస్ కాన్సులేట్లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 1990లలో మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ హైదరాబాద్లో అడుగుపెట్టడం నుంచి, సత్య నాదెళ్ల (Satya Nadella) ఆ సంస్థకు సీఈవోగా ఎదగడం వరకు సాగిన ప్రయాణం తెలుగువారి నైపుణ్యానికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్, అమెరికాకు ఉన్న బంధం దౌత్యపరమైనదే కాదని, అమెరికాలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల రూపంలో ఆ దేశం ప్రతి తెలుగు ఇంటిలో ఒక భాగమైందని చెప్పారు. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం అందరికీ గర్వకారణమని అన్నారు. అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యÖఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు పెట్టాలని నిర్ణయించాం. దక్కన్ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన యÖఎస్ కాన్సులేట్ కొత్త భవనం సాంస్కృతిక దౌత్యానికి ప్రతీకగా నిలుస్తోంది అని భట్టి పేర్కొన్నారు.