
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Record Price For Maize: తెలంగాణలో ఎక్కువ శాతం వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అయితే ఒక పంట కోత పూర్తి అయిన తర్వాత తర్వాత పంట వేసే వరకు చాలా మంది రైతులు తమ భూములను ఖాళీగా వదిలేస్తుంటారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రైతులు అదనంగా ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా రైతులు జూన్ -జులై నెలలో మొక్కజొన్న విత్తుతుంటారు. నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు.
ఈ మొక్కజొన్నను మూడు సీజన్లలో రబీ,ఖరీఫ్, జైద్ పంటల్లో ఏడాదికి మూడు సార్లు సాగు చేయవచ్చు. మొక్కజొన్న సాగుతో రైతులు భారీ లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్నను భోజనం, కోళ్ల దాణా, పశుగ్రాసం ఆల్కహాల్, స్టార్చ్ గా ఉపయోగిస్తుంటారు. మొక్కజొన్న గడ్డి పశువులకు మేతగా అందిస్తారు. దీని వల్ల రైతులు తమ పశువులకు ఆహారంగా ఏడాదిలో 12 నెలలు పచ్చిమేత సులువుగా లభిస్తుంది. ఈ మొక్కజొన్న మిల్లేట్ వర్గానికి చెందిన ధాన్యం. ఈ పంట వరి, గోధుమ పంటల వలే లాభాదాయకంగా ఉంటుంది. మార్కెట్లో మొక్కజొన్నను ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు.
మొక్కజొన్నను ఏ సీజన్ లో అయినా సాగు చేయవచ్చు. దీనిలో ప్రకాశ్, పూసా, లక్ష్మీ 405, మాధురి, ప్రియ, ఆజాద్ వంటి రకాలు ఉన్నాయి. బంకమట్టి, ఇసుక అంటే లోమీ నెలల్లో కూడా మొక్కజొన్నను సాగు చేయవచ్చు. మొక్కజొన్నను రబీసీజన్ లో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ కు జైడ్ సీజన్ లో అంటే మార్చి నుంచి మే వరకు , ఖరీఫ్ సీజన్ లో అంటే జూన్ నుంచి జులై వరకు పండిస్తారు. ఈ పంట 75 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాల్ కు రూ. 2000 నుంచి రూ. 2,500 వరకు ధర పలుకుతుంది. పెట్టుబడులు పోను ఎకరాకు సుమారు 40వేల నుంచి 70వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
విత్తనాలు,ఎరువులు: రూ. 8,000 - రూ. 10,000 దుక్కి, కూలీలు, ఇతర ఖర్చులు: రూ. 10,000 - రూ. 12,000 మొత్తం పెట్టుబడి: దాదాపు రూ. 20,000 - రూ. 22,000 మొత్తం ఆదాయం: రూ. 60,000 - రూ. 80,000 నికర లాభం: రూ. 40,000 వరకు ఉంటుంది.
అయితే వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న పంటకు రికార్డు స్థాయిలో ధర లభించింది. క్వింటాల్కు రూ. 2310 లభించింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400 ఉంది. ప్రైవేట్ వ్యాపారులు ఈ స్థాయిలో ధర పలకడం కూడా ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన రైతు మామిండ్ దేవేందర్ తన రెండు ఎకరాల్లో పండించిన మొక్క జొన్న 72క్వింటాళ్లు వచ్చింది. ఈ ధరకు విక్రయించి భారీ లాభాలను పొందారు. ప్రభుత్వ మార్క్ ఫెడ్ కేంద్రాల్లో కొనుగోళ్లు జాప్యం కారణంగా పంటను ఇంట్లోనే నిల్వ ఉంచి.. ఓపెన్ మార్కెట్లో ఊహించని ధర లభించడంతో ఆ రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.