
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెంది
Jun 23 2026 12:11 PM | Updated on Jun 23 2026 12:15 PM
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెందిన బుద్ధ వెంకటప్రతాప్ రెడ్డి–ప్రశాంతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. తల్లి ప్రశాంతితో కలిసి కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20) ఇటీవల మయూరీ నగర్లోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి గోడకు ఆనుకొని ఉండగా అదుపు తప్పి కిందపడింది. వాచ్మెన్ సమాచారం ఇవ్వడంతో తల్లి ప్రశాంతి కూతురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాణమ్య డిగ్రీ ఆన్లైన్లో చదువుతోంది. మృతురాలి తల్లి ప్రశాంతికి స్థానికంగా ఓ ఫ్లాట్ ఉందని.. రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు