
దిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో దిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy), కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) సంయుక్తంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్తో నిన్న సీఎం రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈనేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.