
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 23: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్.. ఖట్టర్తో భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -1 టేకోవర్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ నిధుల విడుదల వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.
అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్
ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
Read Latest Telangana News And Telugu News