
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన మిత్రురాలి నుంచే ఊహించని రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. యూరప్లో ట్రంప్కు అత్యంత సన్నిహితురాలిగా, ఆయన విధానాలకు మద్దతుదారుగా పేరు పొంది
న ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోనీ, ఇప్పుడు ఆయనపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కోరని, మిత్రులను కాదని శత్రువులకు వంత పాడతారని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేగాక నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పడిపోతున్న తన పాప్యులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్కు చురకలు అంటించారు. జీ7 దేశాల నేతల్లో మరెవరూ చేయని సాహసాన్ని మెలోనీ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ఎంతో ఉత్సాహభరితంగా ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా, చివరికి అంతా సర్దుకుపోయారు. కానీ, సమావేశం ముగిసిన వెంటనే మెలోనీ నేరుగా ట్రంప్ను లక్ష్యంగా చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో, మయామిలో జరగాల్సిన యూఎస్-ఇటలీ బిజినెస్ ఫోరమ్ను ఇటలీ విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ ఫోరమ్లోనే అమెరికా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పాక్స్ సిలికా' అనే కీలక ఖనిజాల ఒప్పందంపై ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. తాజా విభేదాలతో ఈ ఒప్పందం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.నిజానికి 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూరప్లోని చాలా మంది నేతలు ఆయనతో నేరుగా ఘర్షణకు దిగడం