
విజయవాడ: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. రెండు చోట్ల 7వేల మంది కూర్చొని యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో రాందేవ్ బాబా ప్రాణయామం చేయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.