
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలపై పశ్చిమ దేశాలదే పైచేయి ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జీ7లో సభ్యదేశం కాకపోయినా..
భారత్కు ప్రతి ఏడాది ప్రత్యేక ఆహ్వానం అందడం వెనుక ఇదే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరగడంతో జీ7 దేశాలు కూడా మనదేశ అభిప్రాయాన్ని విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది.అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ కలిసి జీ7 కూటమిగా ఉన్నాయి. ఈ దేశాలే ప్రపంచంలోని సంపన్న ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు పొందాయి. అయితే వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, భద్రతా సవాళ్లు, సరఫరా వ్యవస్థల వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో భారత్ను కూడా చర్చల్లో భాగస్వామి చేస్తున్నాయి.గ్లోబల్ సౌత్కు భారత్ గొంతుకఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు అంతర్జాతీయ వేదికలపై తగిన స్థాయిలో ప్రతిబింబించడం లేదనే భావన చాలాకాలంగా ఉంది. ఈ దేశాల తరఫున బలంగా మాట్లాడుతున్న దేశంగా భారత్ ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వారధిగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రపంచ స్థాయి విధానాలు విజయవంతం కావాలంటే భారత్ వంటి దేశాల సహకారం అవసరమని జీ7 దేశాలు భావిస్తున్నాయి.భారీ మార్కెట్గా భారత్140 కోట్లకు పైగా జనాభాతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం, సాంకేతిక రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. సరఫరా వ్యవస్థలను విస్తరించాలనుకుంటున్న పలు దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారింది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలోనూ భారత్ పాత్ర