
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Rythu Bharosa Funds Release On June 26: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా (Rythu Bharosa) నిధులపై రైతులకు శుభవార్త అందింది. ఈ నెల 26వ తేదీన వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారికంగా విడుదల చేయనున్నారు. మధిర బహిరంగ సభలో ఆయన ఈ నిధులను విడుదల చేసి ప్రసంగించనున్నారు. వానాకాలం సాగు కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీని ప్రకారం 73 లక్షల మంది రైతులకు ఈ వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది.
వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని రూపొందించింది. గతంలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో, పారిశ్రామిక ప్రాంతాలు, రియల్ ఎస్టేట్, సాగుకు యోగ్యం కాని భూములను మినహాయించి, ప్రస్తుతం ప్రభుత్వం భూమి ధ్రువీకరణను కూడా నిర్వహిస్తోంది. అర్హులైన రైతులకు ప్రతి సీజన్కు ఎకరానికి రూ.6,000 చొప్పున సాయం అందుతుండగా, భూమి లేని కూలీలకు కూడా అదనపు నిబంధనల ద్వారా మద్దతు ఇస్తూ, నాణ్యమైన వరి విత్తనాల కోసం ప్రత్యేక రాయితీలను కూడా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కల్పిస్తోంది.
ఎకరానికి రూ.6000 సాయం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని సవరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసాను ప్రవేశపెట్టింది. రెండు ప్రధాన సీజన్లకు అంటే ఖరీఫ్, రబీలకు ఎకరానికి చొప్పున నిధులను అందిస్తారు. ప్రతి సీజన్కు ఎకరాకు రూ.7,500 చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుత సీజన్కు మాత్రం ఎకరాకు రూ.6,000 విడుదల చేస్తున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి.
భూమి లేని రైతులు కూడా రైతు భరోసా పథకాన్ని పొందాలంటే, తాము భూమి లేని వారమని అధికారులకు నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వారికి ఏడాదికి రూ.15,000 ప్రయోజనాలను అందిస్తున్నారు. అలాగే రైతు భరోసా పథకం ప్రత్యేకంగా వరి సాగు కోసం ఎకరానికి రూ.500 బోనస్ను కూడా అందిస్తుంది. ఈ ప్రయోజనం పొందాలంటే రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు సాక్ష్యంగా పంట అమ్మకాల వివరాలను సమర్పించాలి. గతంలో రైతు బంధు పథకం కింద రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు ,కొండల వంటి వ్యవసాయేతర భూములకు నిధులు కేటాయించడం వల్ల భారీగా నిధుల వృథా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది.
దీనిని దృష్టిలో ఉంచుకుని, మైనింగ్, పారిశ్రామిక ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే సాగుకు యోగ్యం కాని భూములను మినహాయించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి ధ్రువీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా సుమారు 15 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాదని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులకు కలిగే ప్రయోజనాలు.. ప్రతి సీజన్ ఖరీఫ్ ,రబీలో రూ.6,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. గత యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకే సాయం పరిమితం చేయడంపై రైతులు చేసిన విమర్శలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, ప్రతి ఎకరానికి సాయం అందించాలని నిర్ణయించింది. అలాగే కొత్తగా డిజిటల్ పట్టాలు పొందిన రైతులకు కూడా నిధులు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున, రైతులు అప్పుల భారం లేకుండా పంటలు పండించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. మొదటి దశలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ముందుగా జమ చేస్తారు.. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి నిధులు అందజేస్తారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సాగు వివరాలు, రైతు భరోసా జమ ,వ్యవసాయ యూనివర్సిటీ అంశాలపై చర్చించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.