
భార్య పట్ల ప్రేమను చాటుకోవడానికి భర్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే, మరికొందరు మాటలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన భార్యపై ఉన్న ప్రేమతో, ఆమె పడుతున్న కష్టాన్ని చూడలేక ఏకంగా ఓ అద్భుతాన్నే సృష్టించారు.
ఐదో తరగతి మాత్రమే చదివిన ఆయన, తనలోని సాంకేతిక నైపుణ్యంతో ఇంట్లోనే ఓ ఎస్కలేటర్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చదువుకు, ప్రతిభకు సంబంధం లేదని మరోసారి నిరూపించారు.తూర్పు గోదావరి జిల్లా, అర్తమూరు గ్రామానికి చెందిన సత్తి శివనారాయణరెడ్డి వృత్తిరీత్యా రైతు.
ఆయన ఐదో తరగతి వరకే చదువుకున్నారు. ఆయన భార్య గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీంతో రెండంతస్తుల ఇంట్లో మెట్లు ఎక్కి, దిగడానికి ఆమె చాలా ఇబ్బంది పడేవారు. రోజూ భార్య పడుతున్న ఈ వేదనను చూడలేకపోయిన శివనారాయణరెడ్డి, ఆమె కష్టాన్ని తీర్చాలని సంకల్పించారు.
ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారం కనుగొనాలని ఆలోచించారు.శివనారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచే ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి. చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకునేవారు. ఆ అనుభవంతోనే ఇంట్లో మెట్లపై ఎస్కలేటర్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం 1.5 హెచ్పీ మోటార్, మెట్లకు సరిపడా రేకు, మూడు ఆటో స్టాపర్లు, రెండు స్టాపర్లు, బేరింగ్లు, ఎలక్ట్రికల్ వైర్లను సమకూర్చుకున్నారు. వీటన్నింటి సాయంతో తన ఆలోచనకు రూపం ఇచ్చారు. ఈ మొత్తం నిర్మాణానికి ఆయనకు సుమారు రూ.70 వేలు ఖర్చు అయింది.
ఈ ఎస్కలేటర్