స్నేహితులు లేదా బంధువుల నుంచి అత్యవసర అవసరాల నిమిత్తం నగదు రూపంలో అప్పు తీసుకుంటున్నారా? అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం, 20,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో అప్పుగా స్వీకరిస్తే, తీసుకున్న మొత్తానికి సమానమైన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిబంధన బంధువులు, స్నేహితుల మధ్య జరిగే వ్యక్తిగత లావాదేవీలకు సైతం వర్తిస్తుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే లావాదేవీలో లేదా విడతల వారీగా 20,000 రూపాయలకు మించి నగదు రూపంలో అప్పులు, డిపాజిట్లు లేదా ఇతర నిర్దిష్ట మొత్తాలను స్వీకరించడం నిషిద్ధం. ఈ నిబంధనను ఉల్లంఘించిన పక్షంలో, సెక్షన్ 271D కింద 100 శాతం జరిమానా విధిస్తారు.
లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను నియంత్రించి, బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఆర్థిక పారదర్శకతను పెంపొందించడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం.అప్పు ఇచ్చేవారు కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహితులైనప్పటికీ ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉండదని విభవాంగళ్ అనుకుల్కారా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సిద్ధార్థ్ మౌర్య స్పష్టం చేశారు. నగదుకు బదులుగా బ్యాంకు అకౌంట్ ట్రాన్స్ఫర్, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా లావాదేవీలు నిర్వహించడం సురక్షితమని ఆయన సూచించారు.
ఇటువంటి లావాదేవీల్లో రుణం తీసుకున్నవారితో పాటు ఇచ్చిన వారిపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిశిత పరిశీలన ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్యాంకు డిపాజిట్లు, వార్షిక సమాచార నివేదిక