
ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన జాతీయ సమైక్యత సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదన్న పవన్ కళ్యాణ్ చిన్న చలిచీమలు కూడా బలమైన సర్పాన్ని చంపేస్తాయని సుమతీ శతకం నుంచి ఉదాహరణతో, విభజనవాద శక్తులు దేశ సమగ్రతను బలిచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిన్న మనుషులు అని తక్కువ అంచనా వేయకూడదు. వారి ఆలోచనలు దేశానికి మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అనేది గమనించాలి.దేశ శ్రేయస్సు, ఐక్యత లక్ష్యంగా జనసేన కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నా, వాటిని విభజనవాద దిశగా మళ్లించకుండా జాగ్రత్తగా ఉండాలి అని జనసైనికులకు స్పష్టమైన సూచనలు చేశారు.
జనసేన ఎప్పటికప్పుడు దేశ శ్రేయస్సు, ఐక్యతను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించారు.లక్ష సభ్యులతో మొదలై 20 లక్షలకు పైగా సభ్యత్వంతో జనసేన లక్ష సభ్యులతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వం సాధించిందని, 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో బలం పెంచుకుందని తెలిపారు.
అధికారం కోసం కాకుండా దేశ సమగ్రత, ప్రాంతీయ ఆకాంక్షలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇస్తూ, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన అశాంతి ఇప్పటికీ కొనసాగుతోందని, జనసేన ఎప్పుడూ విభజనను ప్రోత్సహించలేదని వివరించారు.ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే..
ఇలా చెయ్యాలి!కోట్లాది మంది ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అర్థం చేసుకుని, దానిని నిర్మాణాత్మక
దిశలో మళ్లించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కోట్లాది మంది ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని, విభజన బాటలో పయనించకుండా ఐక్యతా బాటలో నడవాలని జనసైనికులను కోరారు. ఈ సమావేశం జనసేన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించడంలో మైలురాయిగా మారనుందని అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.