
మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రెండ్రోజులుగా ఆగకుండా పెరుగుతూ పోతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడటంతో...బంగారం మార్కెట్లపై ప్రభావం పడింది. అటు స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇవాళ భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి.
ట్రంప్ తన పుట్టినరోజు సందర్భంగా...ఇరాన్ తో శాంతి డీల్ కుదుర్చుకున్నారు. ట్రంప్ ప్రకటనతో హర్మూజ్ తెరుచుకుని ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు మరింత పెరిగొచ్చని భావిస్తున్నారు.
ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్పై ప్రభావం చూపడంతో ఇన్వెస్టర్లు మళ్లీ విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ధరలు చూస్తే...24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,450 పెరిగి రూ.1,51,530కు చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,250 పెరిగి రూ.1,38,900 వద్ద స్థిరపడింది. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒక్కరోజులోనే కిలో వెండి ధర వేల రూపాయల మేర పెరిగి కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంది.
దీంతో వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వెండిపై ఏకంగా రూ.10000 ఎగబాకి రూ.2.80 లక్షల వద్ద నమోదైంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా డాలర్ మార్పులు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే పసిడి ధరలు మరిన్ని రికార్డులు దాటే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనాలని భావిస్తున్న వారు, పెట్టుబడులు పెట్టే వారు ప్రతిరోజూ ధరల మార్పులను గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
.