
పశ్చిమ ఆసియాలో మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఫలించి, ఇరు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ శాంతి పత్రాలపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.ఈ ఒప్పందం ఖరారైన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
హర్మూజ్ జలసంధిపై ఉన్న నౌకాదళ ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు. "ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచ దేశాల నౌకలు.. మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి" అంటూ చమురు సరఫరాను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
ఈ ఒప్పందం ప్రకారం, లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లో తక్షణ కాల్పుల విరమణ అమలులోకి వస్తుంది.అయితే, ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు ఇరాన్కు చెందిన నిధుల విడుదల అంశం కీలకంగా మారింది. అమెరికా ఆంక్షల కారణంగా వివిధ దేశాల్లో నిలిచిపోయిన 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.
లక్ష కోట్లు) నిధులను చర్చలకు ముందే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్ను ట్రంప్ తోసిపుచ్చారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ అమలు చేసిన తర్వాతే, పనితీరు ఆధారంగా విడతల వారీగా మానవతా దృక్పథంతో నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ శాంతి ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. స్విట్జర్లాండ్లో జరిగే ఈ సమావేశం పశ్చిమాసియాలో శాంతి