
కోర్టు హాల్ అంటేనే గంభీరమైన వాతావరణం.. లాయర్ల వాదనలు, జడ్జ్ తీర్పులతో నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఒక మధ్యవయస్కురాలైన మహిళ నేరుగా కోర్టు హాల్లోకి దూసుకెళ్లి, ఏకంగా జిల్లా జడ్జి కుర్చీలోనే కూర్చుండిపోయింది!
అంతటితో ఆగకుండా, టేబుల్పై ఉన్న గ్యావెల్ (సుత్తి)ని గట్టిగా బాదుతూ.. ఆర్డర్.. ఆర్డర్.. ఈరోజు నేనే జిల్లా జడ్జిని! సాక్షులను, ఆధారాలను నా ముందు ప్రవేశపెట్టండి! అంటూ హల్చల్ చేసింది. శుక్రవారం ఉదయం వారణాసి జిల్లా కోర్టులో జరిగిన ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అసలేం జరిగిందంటే..?శుక్రవారం ఉదయం కరెక్ట్గా 9:00 గంటల సమయంలో ఈ హైడ్రామా మొదలైంది.
అదనపు జిల్లా జడ్జి (ADJ) యజువేంద్ర విక్రమ్ సింగ్ ఆ రోజు సెలవులో ఉండటంతో కోర్టు హాల్ ఖాళీగా ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఆ మహిళ.. గబగబా కోర్టు హాల్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బందిని జడ్జి గారు సాధారణంగా ఏ టైమ్కి వస్తారు?
అని అడిగింది. వారు సమాధానం చెప్పేలోపే.. చకచకా డయాస్ పైకి ఎక్కి, ఏకంగా జడ్జి అధికారిక కుర్చీలో సెటిల్ అయిపోయింది. టేబుల్పై ఉన్న కేస్ ఫైళ్లను తిరగేస్తూ నిజంగానే విచారణ జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది.గంటపాటు ఉత్కంఠ.. లాయర్లకే దిక్కుతోచలేదు!మహిళ ప్రవర్తన చూసి షాకైన కోర్టు సిబ్బంది, లాయర్లు ఆమెను కిందకు దిగమని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కానీ, ఆమె మాత్రం ఎవ్వరి మాట వినలేదు. తనను దించడానికి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిపై గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు గంటపాటు కోర్టు హాల్లో ఈ హైడ్రామా కొనసాగింది.ఒకే బెంచ్పై రిక్షా డ్రైవర్ బిడ్డ..
సుప్రీంకోర్టు జడ్జి బిడ్డ!రంగంలోకి దిగిన లేడీ పోలీసులుపరిస్థితి చేతులు దాటిపోవడంతో కోర్టు సిబ్బంది వెంటనే కాంట్ (Cantt) పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు
కోర్టు హాల్ అంటేనే గంభీరమైన వాతావరణం.. లాయర్ల వాదనలు, జడ్జ్ తీర్పులతో నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఒక మధ్యవయస్కురాలైన మహిళ నేరుగా కోర్టు హాల్లోకి దూసుకెళ్లి, ఏకంగా జిల్లా జడ్జి కుర్చీలోనే కూర్చుండిపోయింది! అంతటితో ఆగకుండా, టేబుల్‌పై ఉన్న గ్యావెల్ (సుత్తి)ని గట్టిగా బాదుతూ.. ఆర్డర్.. ఆర్డర్.. ఈరోజు నేనే జిల్లా జడ్జిని! సాక్షులను, ఆధారాలను నా ముందు ప్రవేశపెట్టండి! అంటూ హల్చల్ చేసింది. శుక్రవారం ఉదయం వారణాసి జిల్లా కోర్టులో జరిగిన ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అసలేం జరిగిందంటే..?శుక్రవారం ఉదయం కరెక్ట్‌గా 9:00 గంటల సమయంలో ఈ హైడ్రామా మొదలైంది. అదనపు జిల్లా జడ్జి (ADJ) యజువేంద్ర విక్రమ్ సింగ్ ఆ రోజు సెలవులో ఉండటంతో కోర్టు హాల్ ఖాళీగా ఉంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఆ మహిళ.. గబగబా కోర్టు హాల్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బందిని జడ్జి గారు సాధారణంగా ఏ టైమ్‌కి వస్తారు? అని అడిగింది. వారు సమాధానం చెప్పేలోపే.. చకచకా డయాస్ పైకి ఎక్కి, ఏకంగా జడ్జి అధికారిక కుర్చీలో సెటిల్ అయిపోయింది. టేబుల్‌పై ఉన్న కేస్ ఫైళ్లను తిరగేస్తూ నిజంగానే విచారణ జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది.గంటపాటు ఉత్కంఠ.. లాయర్లకే దిక్కుతోచలేదు!మహిళ ప్రవర్తన చూసి షాకైన కోర్టు సిబ్బంది, లాయర్లు ఆమెను కిందకు దిగమని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె మాత్రం ఎవ్వరి మాట వినలేదు. తనను దించడానికి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిపై గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు గంటపాటు కోర్టు హాల్లో ఈ హైడ్రామా కొనసాగింది.ఒకే బెంచ్‌పై రిక్షా డ్రైవర్ బిడ్డ.. సుప్రీంకోర్టు జడ్జి బిడ్డ!రంగంలోకి దిగిన లేడీ పోలీసులుపరిస్థితి చేతులు దాటిపోవడంతో కోర్టు సిబ్బంది వెంటనే కాంట్ (Cantt) పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది ఎట్టకేలకు ఆమెను జడ్జి కుర్చీలోంచి దించి, అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.పోలీసులు ఏమన్నారంటే?ఆమె ప్రవర్తనను పరిశీలించిన తర్వాత, సదరు మహిళ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా, కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, స్థానిక న్యాయవాదుల కథనం ప్రకారం.. ఈ మహిళ గతంలో కూడా ఇలాగే ఒకసారి కోర్టులోకి చొరబడి జడ్జి కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.ప్రధాని మోదీ భద్రతపై ఆందోళన! ఒకే ఒక్క లేఖతో దేశవ్యాప్తంగా వైరల్భద్రతా వైఫల్యంపై జడ్జి సీరియస్.. విచారణకు ఆదేశం!ఈ రచ్చ ముగిసిన తర్వాత కోర్టు హాలును పరిశీలించిన ఏడీజే యజువేంద్ర విక్రమ్ సింగ్.. కోర్టు ప్రాంగణంలో భద్రతా లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అంత సెక్యూరిటీని దాటుకుని ఆ మహిళ కోర్టు హాల్లోకి, అది కూడా జడ్జి కుర్చీ వరకు ఎలా రాగలిగిందో సమాధానం చెప్పాలంటూ డ్యూటీలో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై అధికారిక విచారణకు కూడా ఆయన ఆదేశించారు. భద్రత నడిబొడ్డున ఉన్న కోర్టులోనే ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.