
Ttd big alert to devotees on ssd tokens: తిరుమలలో భక్తుల రద్దీ గత వారంతో పొలిస్తే బాగా తగ్గింది. ఈ క్రమంలో టీటీడీ సైతం శ్రీవారి ఎస్ఎస్ డీ ఉచిత దర్శనం టొకెన్ల జారీ సమయాల్ని మరోసారి మార్పులు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొన్నిరోజులతో పోలిస్తే ఒక్కసారిగా తగ్గిపోయింది.
ఒకవైపు సమ్మర్ హలీడేస్ లు ముగియడంతో కంపార్ట్ మెంట్ లు అన్ని ఖాళీగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఎస్ డీ టొకెన్లు ఉన్నభక్తులకు దర్శనాలకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇక రూ. 300 ల టోకెన్లు ఉన్నవారికి దర్శనాలకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
ఈ క్రమంలో ఒకవైపు వానలు, మరోవైపు ఉక్కపోతతో భిన్నమైన వాతావరణంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మర్ హలీడేస్ నేపథ్యంలో విపరీతమైన భక్తుల రద్దీతో టీటీడీ ఎస్ఎస్ డీ టొకెన్ల జారీని అర్దరాత్రి జారీ చేయడం ప్రారంభించింది.
ఎండల నేపథ్యంలో అర్ద రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కూడా ఎస్ఎస్ డీ టోకెన్లను జారీ చేసే వారు. ప్రస్తుతం ఎండలు కొంతమేర తగ్గి పోయి, సమ్మర్ హలీడేస్ ముగియడంతో మరోసారి ఎస్ఎస్ డీ టొకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం మరల పాత సమయాల్లోనే సర్వదర్శనం టొకెన్ల జారీ నిర్వహిస్తున్నారు.
కొత్త టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్ఎస్ డీ టొకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ డీ టొకెన్ల జారీ సమయాల్లో మార్పులను భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. మరోవైపు ఎలాంటి టొకెన్లు లేని వారికి సర్వదర్శనాలకు 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది.
ప్రతిరోజు శ్రీవారి భక్తులకు ఎస్ఎస్ డీ టొకెన్లను.. టీటీడీ మూడు ప్రదేశాల్లో జారీ చేస్తుంది. టోకెన్ కౌంటర్లు ఉన్న ప్రదేశాలు: భూదేవి
కాంప్లెక్స్ (అలిపిరి దగ్గర), శ్రీనివాసం కాంప్లెక్స్ (టీటీసీ బస్ స్టాండ్ ఎదురుగా), విష్ణు నివాసం (తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా) ప్రతిరోజు టోకెన్లను పైన మారిన సమయాల్లో టీటీడీ భక్తులకు జారీ చేస్తుంది.
ఇక నిన్న తిరుమలకు 18-06-2026 రోజున స్వామివారిని 73.703 మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.అంతే కాకుండా.. 37.581 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న శ్రీవారి భక్తులకు సేవకులు తాగు నీరు, స్వామిారి ప్రసాదాలు అందిస్తున్నారు.
శ్రీవారికి 4 02 కోట్ల హుండి ఆదాయం సమకూరింది. తిరుమలకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కూడా టీటీడీ ప్రత్యేకంగా చర్యలకు శ్రీకారం చుట్టింది.